విశాఖపట్నం: జయజయహే : సోమవారం తొలేళ్లు ముగిసిన తెల్లవారితే మంగళవారం కరకచెట్టు పోలమాంబ అమ్మవారికి పంచామృత,క్షీర,చందన,పసుపు,కుంకుమ అభిషేకములు జరిగాయి భక్తుల అమ్మవారికి పసుపు కుంకుమ గాజులు పట్టు వస్త్రాలు మరియు పొంగళ్ళు సమర్పించుకున్నారు వేల సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.అలయ అధికారి గాయత్రి అమ్మవారికి ప్రభుత్వం తరుపున పూజలు నిర్వహించారు ప్రత్యేకముగా కుంకుమార్చన జరిపించారు.అమ్మవారి ఉత్సవమూర్తికి కూడా ప్రత్యేక పూజలు చేసారు సుమారుగా నగరంతో పాటు 14 గ్రామాలకు గ్రామదేవత కావడంతో భక్తులు విపారీతంగా వచ్చారు. భక్తులకు అవసరమయిన ఏర్పాట్లన్నీ దేవాదాయశాఖ సమకూర్చింది,పురపాలక శాఖ ఎప్పటికప్పుడు చెత్త లేకుండా పరిశభ్రంగా ఉంచారు. ఎండలు ఎక్కవుగా ఉండటంతో ముందుజాగ్రత్తగా మంచి నీటి వసతి నగరపరిపాలక శాఖ ఏర్పాటు చేసింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నగర్ పోలీస్ శాఖ అప్రమత్తమైంది డ్రోన్స్ తో ట్రాఫిక్ నియంత్రణ చేసారు. శాంతిభద్రతలను నగర పోలీస్ కమీషనర్ శంఖబ్రత బాగ్చి స్వయంగా ఏర్పాటులను పర్యవేక్షించారు పొలిసు సిబ్బందికి ముందు జాగర్త చర్యలు చూచించారు.