Tuesday, June 17, 2025
HomeBHAKTIడా.గజల్ ఆధ్వర్యంలో "సంపూర్ణ శ్రీమద్భగవద్గీత లోకార్పణ కార్యక్రమం" : ముఖ్య అతిధిగా...

డా.గజల్ ఆధ్వర్యంలో “సంపూర్ణ శ్రీమద్భగవద్గీత లోకార్పణ కార్యక్రమం” : ముఖ్య అతిధిగా జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి డా . నిమ్మల .

పాలకొల్లు: జయజయహే : డా. గజల్ శ్రీనివాస్ సంగీతం సమకూర్చి,గానం చేసిన”సంపూర్ణ భగవద్గీత”( తెలుగు) ఆడియోను 10 ఏప్రిల్ 2025 ఉదయం 10.30 ని.లకు లయన్స్ కమ్యూనిటీ హాలు , పాలకొల్లు లో నా జననీ జనకులు రత్నావళి, కేశిరాజు నరసింహరావు దంపతులు లోకార్పణo , భగవద్ అంకితం చేస్తారని ఎంతో భక్తి తత్పరతతో, సనాతన ధర్మ స్ఫూర్తి తో రూపొందించిన ఈ భగవద్గీత ఆడియో ప్రాజెక్టు గజల్ స్వస్థలమైన పాలకొల్లులో లోకార్పణ కావడం నాకు ఎంతో ఆనందంగా ఉందని గజల్ శ్రీనివాస్ తెలియచేసారు . మన సంస్థ ప్రతినిధులు వచ్చి ఈ ఆధ్యాత్మిక , చారిత్రక ఘట్టంలో పాల్గొని ఆశీర్వదించవలసినదిగా గజల్ కోరారు . లోకార్పణ అనంతరం శ్రీమద్భగవద్గీతను యూట్యూబ్ ద్వారా అందరూ వినవచ్చును అని తెలియచేసారు . ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ఆంధ్రప్రదేశ్ జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి డా. నిమ్మల రామానాయుడు మరియు ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమి చైర్మన్ గుమ్మడి గోపాల కృష్ణ , విచ్చేయుచున్నారు . స్థానిక పెద్దలు, కవులు, కళాకారులు అనేక ప్రాంతాల నుండి ఎంతో మంది ఆత్మీయులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. రాబోయే రోజులలో భగవద్గీత ను 100 భాషలలో రూపొందించి ప్రపంచానికి భగవద్గీత విశిష్టత ను చాటి చెప్పాలని గజల్ శ్రీనివాస్ సంకల్పం. ఇప్పటికే 25 భాషల్లో గీత రికార్డింగ్ పూర్తి అయినది గజల్ తెలిపారు. ఈ కార్యక్రమ ఆనంతరం వచ్చిన అతిధులు అందరు ప్రసాదం తీసుకొని వెళ్ళవలసినదిగా డా. గజల్ శ్రీనివాస్ సురేఖ దంపతులు కుమారి సంస్కృతీ కోరారు .

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments