Monday, June 16, 2025
HomeBlog19న శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్ర: ఇస్రో

19న శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్ర: ఇస్రో

:పలు కారణాలతో వాయిదా పడుతూ వస్తోన్న యాక్సియం-4 మిషన్‌ను ఈ నెల 19వ తేదీన ప్రయోగించనున్నట్లు ఇస్రో శనివారం వెల్లడించింది.

న్యూఢిల్లీ, జూన్‌ 14: పలు కారణాలతో వాయిదా పడుతూ వస్తోన్న యాక్సియం-4 మిషన్‌ను ఈ నెల 19వ తేదీన ప్రయోగించనున్నట్లు ఇస్రో శనివారం వెల్లడించింది. ఈ వాణిజ్య మిషన్‌ ద్వారా భారత వ్యోమగామి శుభాంశు శుక్లాతో పాటు మరో ముగ్గురు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎ్‌సఎస్‌) వెళ్లనున్నారు.

యాక్సియం రోదసీ యాత్రను నాసాకు చెందిన ప్లోరిడాలోని కెన్నెడీ స్పేస్‌ సెంటర్‌ నుంచి ఈనెల 11న ప్రయోగించాల్సి ఉంది. అయితే స్పేస్‌ ఎక్స్‌ ఫాల్కన్‌-9 రాకెట్‌లో ఇంధనం లీకేజీ కారణంగా వాయిదా పడింది. ఇస్రో, యాక్సియం స్పేస్‌, స్పేస్‌ ఎక్స్‌ సమన్వయంతో ఈ ధ్రవ ఆక్సిజన్‌ లీకేజీ సమస్యను పరిష్కరించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments