సింహాచలం : జయజయహే : సింహాచలం లక్ష్మీనరసింహస్వామి చందనోత్సవంలో అపశ్రుతి జరగడం కలచి వేసింది అని మంత్రి కందుల దుర్గేష్ ఆవేదన వ్యక్తం చేసారు . సింహాచలంలో భారీగా కురిసిన వర్షానికి గోడ కూలి మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు . బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుంది అని క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని త్వరగా కోలుకుంటారని మంత్రి దుర్గేష్ అన్నారు . సహాయక చర్యలు కొనసాగుతున్నాయని సింహాద్రి అప్పన్న దర్శనానికి వచ్చి మృతి చెందిన భక్తుల పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను అని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు.
సింహాచలం ఘటన బాధాకరం : మంత్రి కందుల దుర్గేష్
0
28
RELATED ARTICLES
- Advertisment -