Monday, June 16, 2025
HomeBlogసతీష్ ధావన్ స్పేస్ సెంటర్ కు బెదిరింపు కాల్

సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ కు బెదిరింపు కాల్

ఆ బెదిరింపు కాల్ పై అధికారులు చెప్పిందిదే
అయితే, అధికారులు ఈ బెదిరింపు కాల్‌ను ఫేక్‌గా నిర్ధారించారు. బాంబు బెదిరింపు దృష్ట్యా శ్రీహరికోటలో భద్రతా సిబ్బంది అడుగడుగునా గాలించారు. వారికి ఎక్కడ, ఎటువంటి ప్రమాదకర వస్తువులు లభించలేదు. ఈ సంఘటన దేశవ్యాప్తంగా ఇటీవల జరిగిన ఇతర బాంబు బెదిరింపు సంఘటనల నేపథ్యంలో ఆందోళన కలిగించినప్పటికీ ఎక్కడ ఏమి లభించకపోవడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు.

భద్రత బలోపేతం
ఇటీవల కూడా విజయవాడ, శంషాబాద్ విమానాశ్రయం మరియు ఎల్‌టీటీ ఎక్స్‌ప్రెస్‌కు వచ్చిన బెదిరింపులు భద్రతా ఆందోళనలను బాగా పెంచాయి. ప్రస్తుతం, షార్ కేంద్రంలో భద్రతను మరింత బలోపేతం చేసి, పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. సిఐఎస్ఎఫ్ బృందాలు పోలీసులు షార్ పరిసర ప్రాంతాలలో తనిఖీలు కొనసాగిస్తూ సముద్ర మార్గాల లోనూ తీరప్రాంత రక్షణ దళాలు తనిఖీలు చేపట్టాయి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments