Tuesday, June 17, 2025
HomeBlogవీరత్వంతో పోరాడుదాం

వీరత్వంతో పోరాడుదాం

మితిమీరిన సహనం చేతులు కట్టేసింది
దేశానికి వ్యతేరికంగా ఎవరూ మాట్లాడొద్దు
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పిలుపు

జయజయహే:  పహల్గాం దాడితో భారత్ పుట్టెడు దుఃఖంతో మునిగిపోయిందని హిందువు, ముస్లిం అని అడిగి మరీ చంపేసిన విధానం చాలా దారుణమని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఆపరేషన్‌ సిందూర్‌‌ పై స్పందించిన ఆయన బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఉగ్రవాద స్థావరాలపై భారత్‌ దాడిని స్వాగతించినట్లు చెప్పారు. మితిమీరిన సహనంతో చేతులు కట్టేసిన సమస్త భారతానికి… ఆపరేషన్‌ సిందూర్‌తో తిరిగి వీరత్వాన్ని నింపిందని కొనియాడారు. త్రివిధ దళాధిపతులు, ప్రధాని మోదీకి ఈ సందర్భంగా పవన్ కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా రాష్ట్రానికి చెందిన ఇద్దరు కుటుంబాలతో కశ్మీర్ పర్యటనకు వెళ్లిన వారిని ఉగ్రవాదులు చంపేశారని విచారం వ్యక్తం చేశారు. మంగళవారం రాత్రి బారత్ సేనలు పాకిస్తాన్‌లోని 9 ఉగ్ర స్థావరాలనుధ్వంసం చేయడం గొప్ప విషయమని కొనియాడారు. పాక్‌లో సాధారణ ప్రజలకు ఇబ్బంది కలకకుండా, ప్రాణ నష్టం జరగకుండా.. కేవలం ఉగ్ర స్థావరాలపై దాడి చేసి ధ్వంసం చేయడం హర్షించదగ్గ విషయమని అన్నారు. పాకిస్థాన్‌కు ఇది తగిన గుణపాఠమని, ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో ధీటైన జవాబు ఇచ్చామని పవన్ కల్యాణ్ అన్నారు. ఇది ప్రతి భారతీయుడు హర్షించదగ్గ పరిణామమని, సోషల్‌ మీడియాలో ఏది పడితే అది మాట్లాడకూడదన్నారు. భారత్‌ దాడిపై ఎవరు వ్యతిరేకంగా మాట్లాడినా చర్యలు ఉంటాయన్నారు. ప్రతి ఒక్కరు కేంద్రానికి మద్దతుగా నిలవాలని పిలుపిచ్చారు. కొందరు కాంగ్రెస్‌ నేతలు భారత్‌కు వ్యతిరేకంగా మాట్లాడారని పవన్ కల్యాణ్ విమర్శించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments