Wednesday, June 18, 2025
HomeBlogవిశాఖపట్నంలో డ్రోన్ లు నిషేధం.. రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

విశాఖపట్నంలో డ్రోన్ లు నిషేధం.. రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

వ్యాప్తంగా 5 లక్షల మంది పాల్గొంటారని అంచనా వేస్తున్నారు. దీంతో విశాఖపట్నంలో ఆంక్షలు విధించారు పోలీసులు. జూన్ 18 నుంచే నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని ఇప్పటికే పోలీసులు తెలిపారు. అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

విశాఖలోని ఎన్టీఆర్ సర్కిల్ నుంచి పార్క్ హోటల్ వరకు బీచ్ రోడ్డులో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. వాహనదారులు గమనించాలని పోలీసులు తెలిపారు. పార్క్ హోటల్ నుంచి భీమిలి బీచ్ వరకు వాహన రాకపోకలకు ఆంక్షలు ఉంటాయన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవానికి హాజరయ్యే ప్రజలు విజయనగరం నుంచి వచ్చే బస్సుల్లో బోయపాలెం వైపు రావాలని, అల్లూరి జిల్లా నుంచి వచ్చే బస్సులు వేపగుంట వైపు నుంచి రావాలని సూచనలు చేశారు.
ఈ మేరకు ఈ నెల 20, 21న నగరంలో ఏ విధమైన డ్రోన్ లు కూడా ఎగురవేయకూడదని పోలీసులు సూచనలు చేశారు. ప్రధానంగా ఐఎన్ఎస్ చోళ, ఏయూ మైదానం, కాళీ మాత ఆలయం, ఐఎన్ఎస్ కళింగ సమీపంలో 5 కిలోమీటర్ల పరిధిలో డ్రోన్లు నిషేధమని తెలిపారు. ఎవరైనా డ్రోన్ లు వినియోగానికి పాల్పడితే కేసులు నమోదు చేస్తామని ఆదేశాలు జారీ చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments