Saturday, June 21, 2025
HomeBlogరోడ్లను శుభ్రం చేయవలసిందిగా మనవి - అబ్దుల్ కలాం సేవా సంఘం వ్యవస్థాపక చైర్మన్ ఆళ్ళ...

రోడ్లను శుభ్రం చేయవలసిందిగా మనవి – అబ్దుల్ కలాం సేవా సంఘం వ్యవస్థాపక చైర్మన్ ఆళ్ళ ప్రవీణ్ కుమార్

అనకాపల్లి యజయహే : గౌరవనీయులైన అనకాపల్లి జీవీఎంసీ కమిషనర్ బి.వి. రమణ కి వ్రాయునది ఏమనగా అనకాపల్లి జిల్లా విశ్వహిందూ పరిషత్ వారి ఆధ్వర్యంలో జరుగుతున్న హనుమాన్ శోభయాత్ర తేదీ 26-4-2025 శనివారం మధ్యాహ్నం 3-00 గంటలకు గవరపాలెం సుంకరమెట్ట జంక్షన్ నుండి కొత్తూరు జంక్షన్ వరకు శోభాయాత్రకి ప్రజలు జిల్లా నలుమూలల నుంచి వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో హనుమాన్ శోభాయాత్ర పాదరక్షకులు లేకుండా భక్తిశ్రద్ధలతో నడుస్తారు కనుక ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా జీవీఎంసీ కమిషనర్ కి రాస్తున్న విన్నపం రోడ్లను శుభ్రం చేయవలసిందిగా మనవి, అలాగే ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం చేత రెండు వాటర్ ట్యాంకులు పెట్టి రోడ్డు తడిపించవలసిందిగా మా యొక్క విశ్వహిందూ పరిషత్ తరపున మనవి. మా యందు దయ ఉంచి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రోడ్లు శుభ్రం చేయవలసిందిగా మేము అడుగుతున్నాము. ఇట్లు అబ్దుల్ కలాం సేవా సంఘం వ్యవస్థాపక చైర్మన్ ఆళ్ళ ప్రవీణ్ కుమార్, కుంచా చిన్ను, బండి అప్పారావు, నరిసే చిరంజీవి, నటభూషణ శోభన్ బాబు సేవా సమితి చైర్మన్ ముగడ అప్పారావు, ఎస్ గణపతి, మరియు విశ్వహిందూ పరిషత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments