మాడుగుల : జయజయహే : మాడుగుల శ్రీ మోదకొండమ్మ వారి జాతర జూన్ మూడవ తేదీన నిర్వహించనున్న నేపథ్యంలో గురువారం మాడుగుల పంచాయతీరాజ్ అతిధి గృహంలో స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి సమీక్ష సమావేశం నిర్వహించారు. మండల స్థాయి అధికారులు ఆలయ కమిటీ సభ్యులు కూటమి నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ జాతర ఒక ప్రాంతానికి సంబంధించింది కాదని, రాష్ట్రంలోనే పేరు పొందిన జాతర కాబట్టి అధికారులు అందరూ తగు సహకారం అందించి తమ శాఖ పరంగా చేయవలసిన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ముఖ్యంగా పంచాయతీరాజ్ విద్యుత్తు మంచినీటి సరఫరా పోలీస్ వంటి ప్రధాని విభాగాల వారు ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. జాతర సందర్భంగా గ్రామంలో విద్యుత్ సరఫరా అంతరాయం లేకుండా చూడాలన్నారు. అలాగే జాతరలో మూడు రోజులపాటు ప్రతి ఇంటికి మంచినీటి సరఫరా జరిగే విధంగా సంబంధిత అధికారులు కార్యచరణ రూపొందించుకోవాలని చెప్పారు. ఇక భక్తులు రాకపోకలు సాగించే విధంగా రవాణా శాఖ అధికారులు ప్రత్యేక బస్సులు నిర్వహించాలని ఆర్టీసీ వారికి సూచించారు. గ్రామపంచాయతీ వారు ముందుగా గ్రామాన్ని పరిశుభ్రం చేయాలని బ్లీచింగ్ ఫినాయిల్ వంటివి అందుబాటులో ఉంచుకోవడంతో పాటు ఇతర ప్రాంతాల నుంచి అదనపు పారిశుధ్య సిబ్బంది రప్పించి ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. ఇంజనీరింగ్ అధికారులు రహదారులు మరమ్మతులు చేపట్టాలన్నారు. గా వైద్య శాఖ పరంగా జాతరకు వచ్చే భక్తులు అనారోగ్యానికి గురైతే వెంటనే మాకు సేవలు అందించే విధంగా గ్రామంలో ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించాలని సిబ్బందిని అందుబాటు ఉంచాలని ఆదేశించారు. ఇక వివిధ శాఖ జరిపిన ఎమ్మెల్యే ప్రతి ఒక్కరు కూడా ఆలయ కమిటీకి అందుబాటులో ఉంటూ వారిని సమన్వయపరచుకుంటూ వారి సలహాలు తీసుకొని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాజారాం, తహసిల్దార్ రమాదేవి, ఎండి ఓకే అప్పారావు, ఆలయ కమిటీ అధ్యక్షుడు పుప్పాల అప్పలరాజు, సభ్యులు ఎస్ శ్రీనివాసరావు డి. సూర్యారావు బీహెచ్ పైడినాయుడు, ఇతర సభ్యులు, గ్రామ సర్పంచ్ ఎడ్ల కళావతి, ఉప సర్పంచ్ జె వరహాలు,మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అద్దేపల్లి జగ్గారావు, క్లస్టర్ ఇంచార్జి పుప్పాల రమేష్, పట్టణ పార్టీ అధ్యక్షుడు వి రజిత వర్మ, స్థానిక ఎస్ఐ తో పాటు వివిధ శాఖల అధికారులు కూటమి నాయకులు పాల్గొన్నారు.
మోదకొండమ్మ జాతర పై అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష
0
19
Previous article
Next article
RELATED ARTICLES
- Advertisment -