Tuesday, June 17, 2025
HomeBlogమెడికల్ ఖర్చులకు రూ.5,000 అందజేత -వాసుపల్లి ఔదార్యంపై ప్రశంసలు

మెడికల్ ఖర్చులకు రూ.5,000 అందజేత -వాసుపల్లి ఔదార్యంపై ప్రశంసలు

విశాఖపట్నం : జయజయహే : దక్షిణ నియోజకవర్గ పేదల పాలిట ఆపద్బాంధవుడు మాజీ ఎమ్మెల్యే, వైయస్సార్సీపి సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ పేగు క్యాన్సర్ పేషెంట్ కు రూ. 5,000 అందజేసి మరో సారి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. ఆశీలమెట్ట కార్యాలయంలో శుక్రవారం ఉదయం 27వ వార్డుకు చెందిన రావాడ సత్యారావు పేగు క్యాన్సర్ పేషెంట్ కు రూ 5,000 సొంత నగదు మెడికల్ ఖర్చులకు అందజేశారు. 20 ఏళ్లుగా ప్రజా సేవలో ఉంటూ అధికారంలో ఉన్నా లేకున్నా ఒకేలా తన సేవలు కొనసాగిస్తున్న ఏకైక నాయకుడు వాసుపల్లి గణేష్ కుమార్ అని సాయం పొందిన బాధితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ పేదలకు మెరుగైన వైద్యం కోసం కార్పొరేట్ వైద్యం అందించాలన్న సంకల్పంతో వైయస్సార్ ఆరోగ్యశ్రీని ప్రవేశపెడితే ఆయన వారసుడిగా జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యశ్రీలో మరిన్ని సేవలు విస్తృతం చేసిన జననేత ఆదర్శంగా తన ఆర్థిక సాయం కొనసాగిస్తున్నానని వాసుపల్లి గణేష్ కుమార్ వెల్లడించారు. పేద ప్రజలకు అండగా ఉండటమే వైఎస్ఆర్సిపి లక్ష్యం అని, త్వరలో అధికారంలోకి వచ్చిన వెంటనే తన సేవలు మరింత విస్తృతం చేస్తామన్నారు. కార్యక్రమంలో 34 వ వార్డ్ కార్పొరేటర్ తోట పద్మావతి, మాజీ కార్పొరేటర్ మరియు విశాఖ జిల్లా వైఎస్ఆర్సిపి సెక్రెటరీ పద్మనాభం అమ్మాజీ,విశాఖ జిల్లా వైఎస్ఆర్సిపి సెక్రెటరీ గురజాపు రవి, 27 వ వార్డ్ వార్డ్ అధ్యక్షులు నీలపు సర్వేశ్వర రెడ్డి, 29 వ వార్డ్ అధ్యక్షులు పీతల వాసు,33వ వార్డ్ అధ్యక్షులు ముత్త బత్తుల రమేష్,39 వ వార్డ్ అధ్యక్షులు మరియు సౌత్ బూత్ కమిటీ అధ్యక్షులు ముజుబ్ ఖాన్, సౌత్ క్రిస్టియన్ మైనార్టీ విభాగం అధ్యక్షులు సువార్త రాజు, సౌత్ వైయస్సార్ టిఎన్టియుసి అధ్యక్షులు రాజుపాత్రుడు,సౌత్ సోషల్ మీడియా అధ్యక్షులు బేవార మహేష్, సంస్కృత విభాగం అధ్యక్షులు సూర్య నాయుడు ఏరిన్నమ్మ తల్లి గుడి చైర్మన్ లండ రమణ, వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు కృష్ణ కుమార్ రెడ్డి, కృష్ణంరాజు,సాగర్, రాము మాస్టర్ తదితర నాయకులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments