తూటాలు పేల్చితే మిస్సైల్స్ వదలుతాం
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నకు మోదీ వెల్లడి
ఆపరేషన్ సింధూర్ ద్వారా భారతదేశం సైనిక, రాజకీయ, మానసిక లక్ష్యాలను విజయవంతంగా సాధించిందని కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు తెలిపారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతిస్పందనగా జరిగిన ఆపరేషన్ సిందూర్, పాకిస్తాన్తో శత్రుత్వం విషయంలో వ్యూహాత్మక మార్పును సూచిస్తుందని అధికారులు ఓ మీడియా సంస్థకు తెలిపారు. కాశ్మీర్ అంశంపై మాకు ఎవరూ మధ్యవర్తి అవసరం లేదని, అది భారత్లో భాగమేనని ప్రధాని మోదీ కుండబద్ధలుకొట్టారు. పాకిస్తాన్, పీఓకేలోని బహావల్పూర్, మురిద్కే, ముజఫరాబాద్లోని ఉగ్రవాద శిబిరాలపై దాడులతో భారత సైనిక లక్ష్యం నెరవేరింది. “మేం వారిని మట్టిలో కలిపేశాం. బహావల్పూర్, మురిద్కే, ముజఫరాబాద్ ఉగ్రస్థావరాలు నేలమట్టం చేసి, మట్టిలో కలిపేశామని’ ప్రధాని నరేంద్ర మోదీ అన్నట్లు సమాచారం. బలమైన దౌత్య చర్యలో భాగంగా 1960 సింధు జలాల ఒప్పందాన్ని సరిహద్దులు దాటిన ఉగ్రవాదం అనే అంశంతో లింక్ పెట్టారు. సరిహద్దు దాటి వచ్చే ఉగ్రదాడులు చేస్తుంటే చూస్తూ కూర్చోకుండా.. ఉగ్రవాద దాడులు ఆగే వరకు ఒప్పందాన్ని సస్పెండ్ చేయాలని భారతదేశం నిర్ణయించింది. పాకిస్తాన్కు స్పష్టమైన మానసిక సందేశం ఇచ్చినట్లు పేర్కొంది. “మేం పాక్ భూభాగంలోకి ప్రవేశించి మరీ, వారిని ఢీకొట్టాం. వారి గడ్డమీద దాడి చేసి సక్సెస్ అయ్యాం” అని ప్రధానమంత్రి మోదీ అన్నారని సమచారం..
ఆపరేషన్ సింధూర్ ముగియలేదు..
పాకిస్తాన్ వైమానిక స్థావరాలపై దాడుల అనంతరం తలెత్తిన, ప్రస్తుత పరిణామాలపై.. “భారతదేశం స్పష్టమైన సందేశం ఇచ్చింది. అక్కడ ఎవరూ సురక్షితంగా లేరు. ఇది గతం కంటే కొత భిన్నమైన పరిస్థితి. టెక్నికల్, మిలిటరీ మధ్య కొంచెం గ్యాప్ కనిపించింది. ఈ విషయంలో భారతదేశానికి, పాకిస్తాన్ మధ్య భారీ వ్యత్యాసం ఉంది. మనతో పోల్చితే వారు అసలు రేసులో లేరని చెప్పవచ్చు. మన సార్వభౌమాధికారిన్ని ప్రశ్నించేలా ప్రవర్తించడం, ఉగ్రదాడి చేయడంతో భారతదేశం తమకు నచ్చిన తీరుగా ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్తాన్ దాడులలో ఎక్కువ శాతం డ్రోన్స్, మిస్సైల్స్, ఫైటర్ జెట్లు విఫలమయ్యాయి అని ప్రధాని మోదీ అన్నారని తెలిపింది.
ఆపరేషన్ సింధూర్ కొనసాగుతోందని ఏఎన్ఐ వర్గాలు పునరుద్ఘాటించాయి. “వారు దాడి చేస్తే, మేం ప్రతిదాడి చేస్తాం. వాళ్లు కాల్పులు జరిపితే, మేం మిస్సైల్స్ తో తగిన రీతిలో బదులిస్తాం. పాకిస్తాన్ వైమానిక స్థావరాలపై భారత్ దాడి చేయడం కీలక మలుపు అని త్రివిధ దళాల అధిపతులతో ప్రధాని మోదీ చర్చించారు. రెండు దేశాల జాతీయ భద్రతా సలహాదారులు, విదేశాంగ మంత్రుల మధ్య ఎలాంటి చర్చలు జరగలేదు. సైనిక కార్యకలాపాల డైరెక్టర్ జనరల్స్ మధ్యే చర్చ జరిగిందని ఏఎన్ఐ నివేదించింది. ది న్యూ యార్క్ టైమ్స్లోని ఒక నివేదిక ప్రకారం.. ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్తో ఫోన్లో మాట్లాడారు. “పాకిస్తాన్ ఏదైనా దాడి చేస్తే, మా రియక్షన్ భయంకరంగా, మరింత బలంగా, విధ్వంసకరంగా ఉంటుందని” చెప్పారని ఏఎన్ఐ వర్గాలు తెలిపాయి. ఐఎస్ ఐ తో అనుసంధానమై, దగ్గరి లింక్స్ ఉన్న మురిద్కే, బహావల్పూర్లోని ఉగ్రవాద శిబిరాలపై దాడి తర్వాత భారతదేశం కీలక హెచ్చరికలు పంపింది. భారత్ కేవలం ప్రధాన కార్యాలయాలపై దాడి చేస్తుంది. చిన్న చిన్న ఉగ్ర శిబిరాల జోలికి వెళ్లం. మేం బాధితులను, నేరస్థులను ఒకటి చూడలేమని ప్రపంచానికి భారత్ స్పష్టం చేసిందని అన్నారు. ఇంటెలిజెన్స్ పక్కా సమాచారం, ప్లానింగ్తో ఉగ్రవాదుల శిబిరాలపై దాడులు జరిగాయి. రాహీం యార్ ఖాన్ వైమానిక స్థావరం (పాకిస్తాన్లో) రన్వే పూర్తిగా నేలమట్టమైందని సమాచారం. చక్లాల్లో ఉన్న పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ బేస్ నూర్ ఖాన్ కూడా తీవ్రంగా దెబ్బతిందని తెలుస్తోంది.
కశ్మీర్ భారత్కు చెందిన ప్రాంతం. దేశంలోని ఓ భాగం. దానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. మనం పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ (పాక్) ను త్వరలో తిరిగి హస్తగతం చేసుకోవడం తప్ప మాట్లాడటానికి మరేం లేదు. ఒకవేళ పాకిస్తాన్ ఏమైనా చర్చలు జరపాలని భావిస్తే.. అది కేవలం ఉగ్రవాదులను అప్పగించడం అయితే మాట్లాడతాం. ఈ వివాదాలపై మధ్యవర్తిత్వం చేయడానికి భారత్కు ఎవరూ అవసరం లేదు” అని కేంద్రం సంకేతాలు ఇచ్చిందని ఏఎన్ఐ నివేదించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్, పాకిస్తాన్ మధ్య కశ్మీర్ విషయాన్ని మధ్యవర్తిత్వం చేయాలని సూచించిన తర్వాత మోదీ ప్రభుత్వం నుంచి ఈ మెస్సేజ్ బయటకు వచ్చింది. భారతదేశం, పాకిస్తాన్ కాల్పుల విరమణకు అంగీకరించి, ప్రకటన చేసిన మరుసటిరోజైన ఆదివారం నాడు ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, అజిత్ దోవల్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ కు చెందిన అధిపతులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. శనివారం రెండు దేశాల మధ్య ఏర్పడిన అవగాహన తరువాత పాకిస్తాన్ కాల్పుల విరమణను ఉల్లంఘించిందని భారతదేశం ఆరోపించింది. కాల్పుల విరమణ ప్రకటన తరువాత చిన్న దాడులు జరిగాయని.. సరిహద్దు ప్రాంతాల్లో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని చర్చించారు.