తరలించారు.. ఇక, అక్రమ మైనింగ్ కేసులో రిమాండ్లో ఉన్న మాజీ మంత్రి కాకాణికి గుంటూరు సీఐడీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. మాజీ మంత్రి సోమిరెడ్డిపై అసభ్య పోస్టులపై మంగళగిరిలో కాకాణిపై సీఐడీ కేసు నమోదు చేయగా.. దీంతో పీటీ వారెంట్పై ఆయన్ను గుంటూరు కోర్టుకు తీసుకొచ్చారు. న్యాయస్థానం రిమాండ్ విధించడంతో కాకాణిని సీఐడీ అధికారులు నెల్లూరు జిల్లా జైలుకు తరలించారు.. ఇలా వరుసగా వివిధ కేసుల్లో రిమాండ్ లో ఉండగా.. తాజాగా ఇప్పుడు కృష్ణపట్నం పోర్ట్ సమీపంలో అనధికార టోల్ గేట్ ఏర్పాటు చేసి.. వసూళ్లకి పాల్పడిన కేసులో 14 రోజుల రిమాండ్ విధించింది రైల్వే కోర్టు.