మాడుగుల : జయజయహే : మాడుగుల మండల పరిషత్ ఉపాధ్యక్షుని ఎన్నిక ఈ నెల 19వ తేదీన నిర్వహించనున్నట్టు ఎండిఓకే అప్పారావు గురువారం తెలిపారు. ఆరోజు ఉదయం 10 గంటలకు ఎంపీటీసీ సభ్యులందరూ ఉపాధ్యక్షున్ని ఎన్నుకుంటారు. ఇప్పటివరకు మండల ఉపాధ్యక్షుడిగా ఉన్న టీవీ రాజారావు ఎంపీపీగా బాధ్యతలు చేపట్టడంతో ఉపాధ్యక్ష పదవికి ఎన్నిక అనివార్యమైంది. ఇప్పటికే బీరవెల్లి ఎంపీటీసీ కొత్తపల్లి శ్రీనివాస్ ఉపాధ్యక్షుడిగా ఉండండగా, మరో ఉపాధ్యక్షుడు ఎన్నిక నిర్వహిస్తున్నారు. గతంలో ఒక్కో ఉపాధ్యక్షుడు ఉండగా, వైసిపి ప్రభుత్వం మండలానికి ఇద్దరిని ఉపాధ్యక్షులను ఏర్పాటు చేసింది. దీంతో ఒక ఉపాధ్యక్షుడు ఖాళీ ఉండటంతో ఆ పదవికి ఎందుకు నిర్వహిస్తున్నందున ఎంపీటీసీ సభ్యులందరూ విధిగా హాజరు కావాలని సూచించారు.
ఉపాధ్యక్షులు గా పొలిమేర
మాడుగుల మండల పరిషత్ ఉపాధ్యక్షులుగా మాడుగుల ఎంపిటిసి 1 పొలిమేర విజయలక్ష్మి ఎన్నికయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే ఎంపీపీ తో పాటు మరో ఉపాధ్యక్షుడు గ్రామీణ ప్రాంతాలకు కేటాయించడంతో, మండల కేంద్రానికి ఉపాధ్యక్ష పదవి ఇవ్వాలని వైసిపి భావిస్తుంది. గతంలో మాడుగుల టు సిగ్మెంట్ నుంచి ఎన్నికైన వి రామ ధర్మజ మొదటి విడతలో ఎంపీపీగా పని చేయగా, రెండో విడతలో జేడీపేట ఎంపీటీసీ రాజారామ కు అవకాశం కల్పించారు.ఈ నేపథ్యంలో సీనియర్ ఎంపిటిసి అయిన విజయలక్ష్మినీ ఉపాధ్యక్షురాలు గా ఎన్నుకొనే అవకాశం కనిపిస్తుంది.ఇoదుకు మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు కూడా సుముఖతతో ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఆమెకు మాడుగుల పట్టణ పరిధిలో వేరే ఎంపీటీసీ ఎవరు పోటీ కూడా లేకపోవడంతో ఆమెకు లైన్ క్లియర్ అయినట్టే.