చేతులెత్తేసిన విశాఖ వైసీపీ
ఇకనైనా బలపడేనా..!
జయజయహే : గ్రేటర్ విశాఖ మేయర్ పీఠం అన్ని రాజకీయ పార్టీలకు చాలా ప్రతిష్టాత్మకం. రాష్ట్రంలో అతి పెద్ద కార్పొరేషన్ గా ఉండటమే ఇంతుకు కారణం. ఈ గ్రేటర్ సిటీ కార్పొరేషన్ ల ఏ పార్టీ జెండా ఎగిరితే వారిదే హవా. ఎమ్మెల్యేలతో దాదాపుగా సమానంగా విధులు, నిధులు గ్రేటర్ కార్పొరేషన్ కార్పొరేటర్లకుంటాయి. దీంతో ఎలాగైనా సరే పట్టు సాధించాలని పార్టీలు తహతహలాడుతుంటాయి. అయితే గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పీఠం వైసీపీ చేతిలోనే ఉండేది. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అవిశ్వాసం పెట్టి పీఠాలను పెకిలించేస్తున్నారు. ఇందులో భాగంగా గ్రేటర్ విశాఖ కార్పొరేషన్ లోనూ అవిశ్వాస రాజకీయం రంజుగా సాగింది. విశాఖలో మొదలై, భీమిలి.. బెంగళూరు మీదుగా ఏకంగా మలేసియా, సింగపూర్ దేశాల వరకు రాజకీయం సాగిందంటే పార్టీలు ఎంత ఫోకస్ చేసాయో అర్థం చేసుకోవచ్చు. తమ ఖాతాలో ఉన్న మేయర్ పీఠాన్ని ఎలాగైనా సరే నిలుపుకోవాలని వైసీపీ చేయని ప్రయత్నం లేదు. ఏం జరిగినా సరే మేయర్ పీఠం పగ్గాలు తమకు దక్కాలని కూటమి పార్టీలు రసవత్తర రాజకీయం సాగించాయి. అయితే కూటమి పార్టీల నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీలు సమన్వయం చేసుకుని ప్లాన్ చేసుకున్నారు. వైసీపీ మాత్రం మేయర్ పీఠాన్ని నిలుపుకునే బాధ్యతలను ఉత్తరాంధ్రలో అత్యంత సీనియర్ రాజకీయ నాయకుడైన బొత్స సత్యనారాయణకు అప్పగించింది. బొత్సకు ఉన్న రాజకీయ చతురత, స్థానికంగా సామాజిక, ఆర్థిక వనరులపై పట్టు ఉన్న నేపథ్యంలో బొత్సపై భారం పెట్టడం కరెక్టేనని అంతా అనుకున్నారు. తీరా చూస్తే క్లైమాక్స్ లో బొత్స చేతులెత్తేయాల్సి వచ్చింది. ఫోక్స్ వాగన్ కార్ల వ్యవహారంలో సోమ్ములు పోనాయ్… మరేటి సేత్తాం అన్న తరహాలో మేయర్ పీఠం పోయింది.. మరేటి సేత్తాం అన్నడైలాగ్ కు వచ్చారట. బొత్స రంగంలోక దిగారంటే ఏదో సాధిస్తారని ఎలివేషన్స్ వేసుకున్న క్యాడర్ సైతం చివరకు తుస్ మనిపించాల్సి వచ్చిందట. గ్రేటర్ విశాఖ మేయర్ పీఠంపై అవిశ్వాస నోటీసు వ్యవహారం తర్వాత వైసీపీ అధిష్టానం బొత్స సత్యనారాయణకు బాధ్యతలు అప్పగించడానికి చాలా కారణాలున్నాయట. కూటమి పార్టీలు వేసే గాలం నుంచి కార్పొరేటర్లను కాపాడుకోగల సత్తా ఉన్న నాయకుడు ఎవరూ వైసీపీకి విశాఖలో లేనేలేరట. ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి ఎటు నుంచి ఎటు చూసినా సరే కాస్తో, కూస్తో గుడివాడ అమర్ నాథ్ మాత్రమే కనిపిస్తున్నారు. అయితే పూర్తి స్థాయిలో ఈ వ్యవహారాన్ని చక్కబెట్టే పరిస్థితి అధిష్టానానికి కనిపించలేదు. బొత్స పొరుగున ఉన్న విజయనగరం జిల్లాకు చెందిన నాయకుడైనా సరే విశాఖలో పెద్ద ఎత్తున అనుచరగణం, నాయకులతో సత్సంబంధాలు, కాపు సామాజికవర్గం పరంగా పట్టు ఉండటం, రాజకీయ వ్యూహాలను పకడ్బందీగా అమలు చేయడంలో తిరుగులేని టెక్నిక్స్ కలిగిన బొత్స పై భారం పెట్టారు. దీంతో రంగంంలోకి దిగిన బొత్స అవిశ్వాసం వ్యవహారంలో కూటమి పార్టీలకు బహిరంగంగా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఎట్టి పరిస్థితిల్లోనూ మేయర్ పీఠం వైసీపీ నుంచి చేజారబోదని చాలా కాన్ఫిడెంట్ గా బొత్స చెప్పడం, ఆ వెంటనే పార్టీ కార్పొరేటర్లను భీమిలిలోని రిసార్టులో దాచి పెట్టడం జరిగిపోయాయి. దీంతో బొత్స గట్టిగానే ప్లాన్ చేసేసారు.. మేయర్ హరికుమారిపై కూటమి అవిశ్వాసం నెగ్గడం అంత ఈజీగా కాదని అంతా భావించారు. అంతేకాదు తమ పార్టీ కార్పొరేటర్లను భీమిలి రిసార్టు నుంచి కేరళ కు మార్పించేసారు. అక్కడ నుంచి శ్రీలంకకు షిఫ్ట్ చేయించారు. తనకు నమ్మకంగా ఉండే ఒకరిద్దరు ఎమ్మెల్యేల చేతిలో భారీగా డబ్బు పెట్టి కార్పొరేటర్లను దగ్గరుండి బాగా చూసుకోవాలని పురమాయించారు. దీంతో కూటమి అవిశ్వాసం వీగిపోయే అవకాశాలు లేకపోలేదు… క్యాంప్ రాజకీయాల నిర్వహణలో సిద్ధహస్తుడైన బొత్స ఇంత బలంగా రంగంలోకి దిగారంటే ఇక కూటమికి చుక్కలే అనిపించారు. మరోవైపు వైసీపీ కార్పొరేటర్లను తమ వైపు తిప్పుకోవడం పెద్ద పనేమీ కాదని, అంతా సునాయాసంగా సాగి పోతుందని కూటమి వర్గాలు తొలుత ధీమా గా ఉన్నా, బొత్స ప్రత్యక్షంగా రంగంలోకి దిగడం, ఎప్పటికప్పుడు ఎత్తుకు పైఎత్తులు వేస్తుండటంతో టీడీపీ, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలకు సైతం చెమటలు పట్టాయి. ఈజీగా కార్పొరేటర్లను లాగేయొచ్చు అనుకుంటే, అవిశ్వాస ముహూర్తం రోజు నాటికి కూడా పూర్తిస్థాయిలో బలం లేకపోవడంతో టీడీపీ అధిష్టానం ఈ వ్యవహారంపై మినిట్ టు మినిట్ మోనిటర్ చేయాల్సి వ చ్చింది. అయితే అవిశ్వాస తీర్మానానికి సమయం దగ్గర పడుతున్న కొద్దీ టెన్షన్ పెరిగిపోతుండటంతో కూటమి ఎమ్మెల్యేలు ప్లాన్ మార్చేసారు. ఇలా పిలిస్తే అలా వచ్చేసే.. కార్పొరేటర్ల కోసం వెయిట్ చేయకుండా, వ్యాపారాలు, బిజినెస్ అసొసియేట్స్ తో లింక్ లు ఉన్న కార్పొరేటర్లపై కూటమి ఎమ్మెల్యే లు ఫోకస్ చేసారు. దీంతో అవంతి విద్యాసంస్థల అధినేత మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ కుమార్తె ప్రియాంక చివర నిమిషంలో వైసీపీకి రాజీనామా చేసేలా టీడీపీ నేతలు టచ్ లోకి వెళ్లారు. అలాగే గాజువాక మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగి రెడ్డి కుమారుడు వంశీ రెడ్డి కి భారీగా విశాఖ ఆస్తులు, వివాదాలుండటంతో ఆయన్ను టార్గెట్ చేయగా, వర్కౌట్ అయింది. అలాగే హాస్పిటల్స్ తో పాటు విద్యాసంస్థలు నిర్వహిస్తున్న జీవీఎంసీ కో ఆప్షన్ సభ్యుడు బెహరా భాస్కరరావు, కార్పొరేటర్లుగా ఉన్న ఆయన భార్య, కోడలను చివర నిమిషంలో తమ వైపు తిప్పుకున్నారు కూటమి నేతలు. అయితే తమ వర్గ కార్పొరేటర్లకు కేర్ టేకర్ గా ఉన్న బొత్స రాజకీయ ఉచ్చు నుంచి తప్పించుకుని కొందరు కూటమిలో చేరినా సరే సరిగ్గా మేజిక్ ఫిగర్ ను మాత్రమే కూటమి చేరుకోగలిగింది. కనీసం ఓ ఐదు నుంచి పది మందినైనా సరే అధికంగా చేర్చుకోవాలని చూసినా సరే బొత్స పర్యవేక్షణ ఉండంటంతో కూటమికి సాధ్యం కాలేదు. ఇలా కొంత మేర బొత్స సక్సెస్ అయినా సరే, చివర నిమిషంలో కొందరు కార్పొరేటర్ల చేజారడంతో బొత్స ప్లానింగ్ ఫలించలేదు. రాజకీయ చతురత కూడా పని చేయలేదు. నిజానికి చివరలో కూటమిలో ప్రియాంక, వంశీ, బెహరా కుటుంబీకులు చేరుతారని ఊహించ లేదు. వీరంతా వైసీపీకి బాగా నమ్మకస్తులే. అందుకే బొత్స పెద్దగా వీరి కదలికలపై ఫోకస్ పెట్టలేదట. లాస్ట్ మినిట్ లో కూటమి ఎమ్మెల్యేలు టచ్ లోకి వస్తారని బొత్స అస్సలు ఊహించలేదట. ఫిరాయించిన వారు కూడా ఎవరికి ఏమాత్రం అనుమాన రాకుండా చివర్లో పార్టీకి, బొత్సకు కూడా ఝలక్ ఇచ్చారంటున్నారు. అయితే ఉత్తరాంధ్రలో ఇలాంటి రాజకీయాల్లో ఆరితేరిన బొత్స రాజకీయంగా ఇలా బొల్తా పడతారనుకోలేదని పార్టీ వర్గాల్లో గుసుగుసలు వినిపిస్తున్నాయి. గ్రేటర్ పాలిటిక్స్ లో గ్రేట్ పాలిటిక్స్ చేస్తారని ఊహిస్తే, చివరకు బొల్తా కొట్టించారని క్యాడర్ నిట్టూరుస్తున్నారు. రాజకీయాల్లో ఎంత సీనియర్ అయినా సరే కాలం కలిసి రాకపోతే ఎవరూఏమీ చేయలేరని రాజకీయ పండితులు హిత బోధ చేస్తున్నారట