ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వం అమలు చేసిన రేషన్ వాహనాల ద్వారా పంపిణీ వ్యవస్థను రద్దు చేసిన తరువాత తిరిగి రేషన్ దుకాణాల ద్వారా అందిస్తున్నారు. అదే సమయంలో వృద్ధులు, దివ్యాంగులకు రేషన్ డోర్ డెలివరీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే, వీరి విషయంలో ప్రభుత్వం తాజాగా మరో నిర్ణయం అమలుకు సిద్దం అయింది. ఈ రోజు నుంచే ఈ నిర్ణయం అమలు కానుంది.
షన్ పంపిణీ విషయంలో ప్రభుత్వం మరో నిర్ణయం అమలుకు సిద్దం అయింది. రేషన్ షాపుల ద్వారా సరుకుల పంపిణీ చేస్తున్న సర్కార్.. వృద్ధులు, దివ్యాంగులకు మాత్రం ఐదు రోజుల ముందే రేషన్ పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నేటి నుంచే (జూన్ 26) పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. వృద్ధులు, దివ్యాంగులకు ఈ రోజు నుంచే రేషన్ అందించే లా చర్యలు తీసుకున్నారు. ఈ నెల ప్రారంభంలో ఇంటింటికి రేషన్ సరఫరా పై వృద్ధులు, దివ్యాంగు లు సమాచార లోపంతో రేషన్ షాపుల వద్దకు రావటాన్ని అధికారులు గుర్తించారు. దీంతో వచ్చే నెలకు కాస్త ముందుగానే డోర్ డెలివరీ చేయాలని ప్రభుత్వం అధికారులకు, డీలర్లకు ఆదేశాలు జారీ చేసింది.దే సమయంలో వచ్చే నెలకు సంబంధించిన రేషన్ ను సైతం ఈ నెలాఖరు నుంచే ప్రారంభం చేసే విధంగా కసరత్తు జరుగుతోంది. ఈ అయిదు రోజుల పాటు డీలర్లు తమ పరిధిలోని వృద్దులు, దివ్యాంగుల ఇళ్ల వద్దకు వెళ్లి రేషన్ సరుకులను అందజేయనున్నారు. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే మిగిలిన వారికి రేషన్ షాపుల వద్ద సరుకుల పంపిణీ ప్రారంభం కానుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 29,796 చౌక ధరల దుకాణాల ద్వారా 1,46,21,232 మంది రేషన్ కార్డు దారులకు సరుకుల పంపిణీ చేస్తున్నారు. ఇక నుంచి ఇదే విధంగా ప్రతీ నెలా 26వ తేదీ నుంచి 30వ తేదీ లోగా వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి వద్దకే సరుకులు అందజేయనున్నారు. గిరిజన, ఏజెన్సీ ప్రాంతాలు, కొండలపైన నివసిస్తూ రేషన్ షాపులకు దూరంగా ఉన్న వారికి సైతం ఇంటి వద్దకే అందించేలా ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. అదే విధంగా.. ప్రతీ రేషన్ షాపు వద్ద ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ కోసం క్యూఆర్ కోడ్తో కూడిన పోస్టర్ను ఈ నెల నుంచి ఏర్పాటు చేయనున్నారు.