ఈ సంవత్సరం QS ప్రపంచ విశ్వవిద్యాలయ ర్యాంకింగ్స్ 2026లో భారతీయ విశ్వవిద్యాలయాలు సత్తాచాటాయి. దాదాపు 50% భారతీయ సంస్థల ర్యాంకింగ్ మెరుగుపడింది. ఇది దేశ ఉన్నత విద్యా వ్యవస్థకు ఒక పెద్ద విజయంగా పరిగణించబడింది. ఐఐటీ ఢిల్లీ టాప్ లో నిలిచింది. ఈ సంస్థ ప్రపంచ ర్యాంకింగ్లో 123వ స్థానానికి చేరుకుంది. గతసారి భారత్ లో మొదటి స్థానంలో నిలిచిన IIT బాంబే ఇప్పుడు రెండవ స్థానంలో ఉంది. అయితే, దాని ర్యాంకింగ్ కొద్దిగా తగ్గింది – ఇది 2025లో 118 వద్ద ఉంది. ఇప్పుడు 129కి తగ్గింది. IIT మద్రాస్ కూడా దాని ర్యాంకింగ్లో మెరుగుదలను కనబర్చింది. చెన్నైకి చెందిన ఈ సంస్థ ఇప్పుడు 180వ స్థానంలో ఉంది. ఇది మొదటిసారి టాప్ 200లోకి ప్రవేశించింది. గత సంవత్సరం ఇది 227వ స్థానంలో ఉంది.
ఈ మూడింటి తర్వాత, IIT ఖరగ్పూర్, IISc బెంగళూరు నాల్గవ, ఐదవ స్థానాలను దక్కించుకున్నాయి. ఢిల్లీ విశ్వవిద్యాలయం (DU) కూడా తన ర్యాంకింగ్ను మెరుగుపరుచుకుంది. గత సంవత్సరం ఇది 407వ స్థానంలో ఉండగా, ఇప్పుడు 328వ స్థానానికి చేరుకుంది. ఈ సంవత్సరం భారతదేశంలోని 8 కొత్త సంస్థలు ర్యాంకింగ్లో చేర్చబడ్డాయి. ఇప్పుడు భారతదేశంలోని మొత్తం 54 సంస్థలు QS ర్యాంకింగ్లో చేర్చబడ్డాయి. ఈ విధంగా, భారతదేశం నాల్గవ స్థానంలో ఉంది. ఇది అమెరికా (192), UK (90). చైనా (72) స్థానాల్లో ఉన్నాయి. ఈ సంవత్సరం కూడా మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MIT) మొదటి స్థానంలో నిలిచింది. ఇది వరుసగా 14వ సంవత్సరం నంబర్ వన్ స్థానంలో నిలిచింది.