Tuesday, June 17, 2025
HomeBlogప్రతీకారం..!

ప్రతీకారం..!

అర్థరాత్రి పాక్ కకావికలం

విరుచుకుపడ్డ భారత్ దళాలు

పీఓకేలో ఉగ్ర శిబిరాలు ధ్వంసం

ఆపరేషన్ సింధూర్ పేరిట ఎయిర్ స్ట్రైక్

చెప్పి మరీ మెరుపుదాడులు

దేశమంతటా వెల్లువెత్తిన హర్షధ్వనాలు

జయజయహే : భారత్ మాతాకి జై.. పహల్గాం దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్తాన్‌కు ధీటైన జవాబిచ్చింది. పాకిస్తాన్‌లోని ఉగ్రవాది స్థావరాలపై ‘ఆపరేషన్ సింధూర్’ పేరిట వైమానిక దాడులు చేసినట్టు భారత రక్షణ శాఖ ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. పాకిస్తాన్‌తో పాటు పీఓకేలోని తొమ్మిది ఉగ్రవాది ప్రాంతాలను గుర్తించి నాశనం చేసినట్టు పేర్కొంది. అటు పీఓకేలోని లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ ఉగ్రవాద శిబిరాలపై మెరుపు దాడులు చేసింది. పీఓకేలోని ఆయా ఉగ్రవాద శిబిరాలపై మిస్సైల్స్‌తో భారత్ విరుచుకుపడగా.. అక్కడి ప్రజలు భయంతో పరుగులు తీశారు. ఇక ఇండియన్ ఆర్మీ.. ‘ఆపరేషన్ సింధూర్’ పేరిట ‘జస్టిస్ ఈజ్ సర్వ్‌డ్.. జై హింద్’ అని ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేసింది. కాగా, ఇండియన్ ఆర్మీ.. పీఓకేలోని కోట్లి, ముజఫరాబాద్, బహవల్‌పూర్‌లో మెరుపు దాడులు చేసినట్టుగా పాకిస్తాన్ ఆర్మీ ధృవీకరించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతీ నిమిషం.. రాత్రంతా ఈ ఆపరేషన్ సింధూర్ ఎయిర్ స్ట్రైక్స్‌పై నిరంతరం అప్‌డేట్స్ తెలుసుకుంటూ పర్యవేక్షించినట్టు తెలుస్తోంది. తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై భారత్ విజయవంతంగా మెరుపు దాడులు చేసినట్టు తెలుస్తోంది. ఇండియన్ ఆర్మీ.. పీఓకేలోని కోట్లి, ముజఫరాబాద్, బహవల్‌పూర్‌లో మెరుపు దాడులు చేసినట్టుగా పాకిస్తాన్ ఆర్మీ ధృవీకరించింది. అంతేకాకుండా భారత్ ఆర్మీపై దుష్ప్రచారానికి దిగింది. భారత మిస్సైల్ దాడులకు చాలామంది ప్రజలు చనిపోయారంటూ ఇండియాపై నిందలు మోపుతోంది. అయితే ఈ వ్యాఖ్యలను ఇండియన్ ఆర్మీ తిప్పికొట్టింది. ‘ఆపరేషన్ సింధూర్ పేరిట ఉగ్రవాద శిబిరాలనే భారత్ ఆర్మీ లక్ష్యంగా చేసుకుందని, పాక్ సైనిక సౌకర్యాలను, అలాగే పాక్ ప్రజలను టార్గెట్ చేయలేదని భారత రక్షణ శాఖ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. ‘లక్ష్యాల ఎంపిక, అమలులో ఆర్మీ అత్యంత సంయమనం పాటించింది. పహల్గాం దాడికి బదులుగా ఈ చర్య చేపట్టాం. బాధ్యులను జవాబుదారీగా ఉంచేందుకు కట్టుబడి ఉన్నాం’. ఈ దాడులకు సంబంధించి పూర్తి వివరాలు ఇవాళ మధ్యాహ్నం వెల్లడిస్తాం అని పేర్కొంది. ఇదిలా ఉంటే.. భారత్ ఆర్మీ మెరుపు దాడులతో పాకిస్తాన్ పీఎం షెహబాజ్ షరీఫ్ ఉలిక్కిపడ్డారు. భారత్ తమ దేశంలోని ఐదు ప్రాంతాలపై మెరుపు దాడులకు తెగబడిందని ఆరోపించారు. భారత్ చేపట్టిన ఈ యుద్ద చర్యలకు గట్టిగా బదులిచ్చే హక్కు పాకిస్తాన్‌కు ఉందన్నారు. బలమైన కౌంటర్ ఉంటుందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేశం మొత్తం తమ బలగాలకు అండగా ఉంటుందని, శత్రువును వారి లక్ష్యాలను చేరుకోవడానికి ఎప్పటికీ అంగీకరించబోమని వ్యాఖ్యానించారు. అటు పాక్‌లోని ఉగ్రవాద శిబిరాలను భారత్ మట్టుబెట్టడంపై అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ కూడా స్పందించారు. ప్రెస్ మీట్ ద్వారా అడిగిన ప్రశ్నకు ఆయన ఈ విధంగా జవాబిచ్చారు. ‘ఇప్పుడే ఓవల్ ఆఫీస్‌లోకి వస్తుండగా మేం ఆ న్యూస్ విన్నాం. అక్కడేదో జరిగిందని తెలిసింది. అతి త్వరలోనే ముగుస్తుందని ఆశిస్తున్నా. వాళ్లు దశాబ్దాలు కాదు శతాబ్దాలుగా పోరాడుతున్నారు’ అని ఆయన వ్యాఖ్యానించారు. అలాగే నెలకొన్న పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని యూఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ పేర్కొంది. ఇక ఆపరేషన్ సింధూర్ పేరిట భారత వైమానిక దళం పాక్‌లోని ఉగ్రవాద స్థావరాలపై చేపట్టిన మెరుపు దాడులపై కేంద్రమంత్రులు, మహారాష్ట్ర సీఎం, పలువురు రాజకీయ నాయకులతో పాటు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు స్పందించారు. ఆర్మీ ట్విట్టర్ పేజిని త్యాగ్ చేస్తూ ఆయన ‘జై హింద్’ అని క్యాప్షన్ పెట్టి ట్వీట్ చేశారు. ఆ పోస్టుకు ఇండియన్ ఆర్మీ, పహల్గాం టెర్రర్ ఎటాక్, ఎయిర్ స్ట్రైక్, ఆపరేషన్ సింధూర్ అనే ట్యాగ్స్ కూడా ఇచ్చారు. మరోవైపు ఆపరేషన్ సింధూర్ పేరిట భారత ఆర్మీ దాడుల నేపధ్యంలో పాకిస్తాన్ అలెర్ట్ అయింది. లాహోర్, సియాల్‌కోట్ ఎయిర్‌పోర్టులను 48 గంటల పాటు మూసివేస్తున్నట్టు ప్రకటించింది. అలాగే పలు ప్రాంతాల్లోని మసీదుల నుంచి పౌరులు అలెర్ట్‌గా ఉండాలంటూ అధికారులు అనౌన్స్‌మెంట్ చేస్తున్నారు. అలాగే భారత్ మెరుపు దాడులకు పిరికిపంద చర్యగా పాకిస్తాన్ ఎల్‌ఓసీ వద్ద భారత్ వైపు కాల్పులు మొదలుపెట్టింది. ఆ దేశ సైన్యం తాజాగా యుద్ద ట్యాంకులను సరిహద్దులో మోహరించింది. దీంతో భారత ఆర్మీ ఆ కాల్పులను సమర్ధవంతంగా తిప్పికొడుతూ.. సరిహద్దులలో వైమానిక రక్షణ విభాగాలను సన్నద్ధం చేసింది. భారత గగనతలంలోకి శత్రుదేశం నుంచి వచ్చే ఎలాంటి మిస్సైల్స్‌నైనా వెంటనే కూల్చేయడానికి సిద్దమైంది. కాగా, భారత్ ఆర్మీ చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్’లో ఇప్పటివరకు 30 మంది ఉగ్రవాదులు మరణించారని తెలుస్తోంది. బహావల్‌పూర్‌లోని మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది మసూద్ ఆజాద్ హెడ్ క్వార్టర్, జైషే మహమ్మద్‌కు చెందిన మదర్సాలో ఉగ్రవాదులు ఉన్నారన్న పక్కా సమాచారంతో ఆర్మీ మెరుపు దాడి చేసింది. దీంతో అక్కడ 30 మంది ఉగ్రవాదులు హతమైనట్టు సమాచారం. ఇదే విషయాన్ని పాక్ మీడియా కూడా ధృవీకరించినట్టు సమాచారం.

                                 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments