సింధూర్ లో వీరనారీల విశ్వరూపం అభినందనీయం
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వెటరన్ ఫ్లైట్ లెఫ్ట్నెంట్, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి
జయజయహే : దక్షిణ నియోజకవర్గ ప్రజలకు కష్టాల్లో కనబడే ఒకే ఒక్క ప్రజానాయకుడు మాజీ ఎమ్మెల్యే, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వెటరన్ ఫ్లైట్ లెఫ్ట్నెంట్ వాసుపల్లి గణేష్ కుమార్. నిర్విరామంగా తాను చేస్తున్న ఆర్థిక సహాయం లో భాగంగా వైయస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో పనిచేస్తున్న ఆయా మీసాల సంధ్య కుమార్తె మీసాల హాసిని కళాశాల ఫీజు నిమిత్తం రూ.10,000 సొంత నగదును అందజేశారు. 30వ వార్డు రెల్లి వీధి కుంచమాంబ గుడి వద్ద నివాసం ఉంటున్న ఆ పేద కుటుంబానికి ఆశీలమెట్ట పార్టీ కార్యాలయంలో శనివారం ఉదయం ఆర్థిక సహాయం చేశారు. ఈ సందర్భంగా వాసుపల్లి మీసాల హాసినీ తో మాట్లాడుతూ బాగా చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని దీవించారు. నేడు మనదేశంలో పురుషులకు మించి మహిళలు ఉన్నత శిఖరాలు అధిరోహించడంలో ముందుంటున్నారని ఆనందం వ్యక్తం చేశారు. మంగళవారం ఆపరేషన్ సింధూర్ పేరిట జరిగిన యుద్ధంలో పాకిస్తాన్ ఉగ్రవాదుల శిబిరాలను మన వీరనారీలు ధ్వంసం చేసారు. భాగంగా పాకిస్తాన్ లో హఫీజ్ కుటుంబాన్ని 98 మంది ఉగ్రవాదులను మట్టు పెట్టడంలో మన వీరనారీలు కల్నల్ సోఫియా ఖురేషి, వ్యోమిక సింగ్ కనకదుర్గ అమ్మవారిలా విశ్వరూపం చూపారన్నారు. బుల్లెట్ కి బుల్లెట్ తోనే సమాధానం ఇవ్వడం సరైన నిర్ణయం అని వాసుపల్లి అన్నారు. మన ఎస్400 సుదర్శన్ చక్రంలో భారతదేశం వైపు పాకిస్తాన్ చేస్తున్న దొంగదెబ్బను అడ్డుకోవడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుందని అన్నారు. మహిళలలు అయినప్పటికీ ఎంతో ధైర్యంగా పాకిస్తాన్ ఉగ్రవాదులను, వారి శిబిరాలను తునా తునకలు చేశారన్నారు. దొంగ దెబ్బ తీస్తున్న పాకిస్తాన్ కు దిమ్మతిరిగే విధంగా మన సైనికులు దిమ్మతిరిగే షాక్ ఇస్తున్నారన్నారు. కల్నల్ సోఫియా ఖురేషి, వ్యోమికా సింగ్ లాంటి వారిని విద్యార్థినిలు, మహిళలు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. వీరమరణం పొందిన మన తెలుగు జవాన్ మురళి నాయక్ కి అశ్రునివాళులు అర్పిస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా జవాన్ మురళి కుటుంబానికి అండగా నిలవాలని కోరారు. ఇప్పటికే భారతదేశానికి అన్ని ప్రపంచ దేశాల మద్దతు ఉందన్నారు. ఇదే సమయంగా పాకిస్తాను ప్రపంచ పటంలోనే లేనివిధంగా గట్టి దాడి చేయాలన్నారు. సింధూ నది నీళ్లు ఆపడం ఆహార కొరత ఇప్పటికే పాకిస్తాన్ కి ఏ దేశం కూడా సాయం చెయ్యకపోయినప్పటికీ పాకిస్తాన్ దొంగ దాడులు చేస్తోందన్నారు. కాశ్మీర్లో ఆక్రమించుకున్న భూభాగాన్ని మొత్తం భారతదేశం కైవసం చేసుకోవాలన్నారు. ఆపరేషన్ సింధూర్ స్ట్రైక్ లో టాప్ 5 ఉగ్రవాదులను భారత్ హతం చేయగలిగిందన్నారు. యుద్ధం పూర్తి స్థాయిలో జరిగితే పాకిస్తాన్ ప్రపంచ పటంలోనే లేకుండా చేయడానికి మన సైనికులు సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో దక్షిణ వార్డు ప్రెసిడెంట్లు వైసిపి సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.