Friday, June 20, 2025
HomeBlogపెరుగుతున్న గృహ వ్యయం

పెరుగుతున్న గృహ వ్యయం

జయజయహే : జాతీయ శాంపిల్‌ సర్వే కార్యాలయం (ఎన్‌ఎస్‌ఎస్‌వో) విడుదల చేసిన కుటుంబ వినియోగ వ్యయ సర్వే నివేదిక లో పలు ఆసక్తికర అంశాలు వెలడయ్యాయి. చివరిసారిగా 2011-12లో ఈ నివేదిక విడుదలైంది కాగా 2017లో పూర్తిస్థాయి నివేదిక రూపొందించినప్పటికీ డాటాలో లోపాలున్నాయంటూ ఆ నివేదికను కేంద్రం విడుదల చేయలేదు. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని రెండున్నర లక్షల పైచిలుకు కుటుంబాలతో ఈ సర్వే జరిగింది.తాజా నివేదికలో అనేక ఆసక్తికరమైన అంశాలు వెల్లడయ్యాయి. 2011-12 నుంచి 2022-23 మధ్యకాలంలో పట్టణ గృహ వినిమయ వ్యయం 33.5 శాతం, గ్రామీణ ప్రాంత గృహ వినిమయ వ్యయం 40-42 శాతం పెరిగింది. అయితే ఇందుకు వాస్తవ ఆదాయాల పెరుగుదల కన్నా ధరల పెరుగుదలే ప్రధాన కారణం అని సదరు నివేదిక స్పష్తం చేసింది. మరోవైపు గృహ నిర్మాణం కోసం ప్రభుత్వ సబ్సిడీలు కూడా పెరిగాయి. దీంతో పాటుగా విద్యా వ్యయం, గృహోపకరణాల కొనుగోలు, మరమ్మతుల ఖర్చులు పెరగడం గమనార్హం. మారుతున్న జీవనశైలికి ఇది నిదర్శనం అని అర్ధం అవుతోంది. ఈ నివేదిక ప్రకారం గుడ్లు, పాలు, చేపలు, మాంసం వంటి పోషకాహారాలతో పాటుగా ప్రాసెస్డ్‌ ఆహారం, శీతల పానీయాల వినియోగం పెరిగింది. ఇందులో మొదటిది ఆహ్వానించదగ్గదే అయినప్పటికీ రెండోది జీవనశైలి ఆరోగ్య సమస్యల పెరుగుదలకు దారితీస్తుంది. సర్వే నివేదికలో ఆరోగ్య వ్యయం పెరుగుదల కూడా ఈ విషయాన్నే నిర్ధారిస్తున్నది. భవిష్యత్తులో ప్రోసెస్డ్ ఆహారం వినియోగం మరింత భారీగా పెరుగుతుందని, తద్వారా ప్రజలలో ఆరోగ్య సమస్యలు కూదా పెరుగుతాయని సదరు నివేదిక అంచనా వేస్తోంది.2016లో పెద్దనోట్ల రద్దు, 2017లో జీఎస్టీ అమలు దరిమిలా దశాబ్ద కాలంలో గృహ వ్యయం రెండింతలకు పైగా పెరిగిపోవడం గమనార్హం. గ్రామీణ మరియు పట్టణ ఎం పి సి యి ల మధ్య వ్యత్యాసం సంవత్సరాలుగా గణనీయంగా తగ్గిపోయింది, ఇది గ్రామీణ ఆదాయాలను మెరుగుపరచడానికి విజయవంతమైన ప్రభుత్వ విధానాలను సూచిస్తుంది, అయితే ఇది పిరమిడ్ యొక్క దిగువ స్థాయిలలో మరింత స్పష్టంగా కనిపిస్తుంది. దీనికి విరుద్ధంగా, ఎగువన అంతరం ఎక్కువగా ఉంది, ఇది అధిక ఆదాయ స్థాయిలలో అసమానత పెరుగుదలను ప్రతిబింబిస్తుంది, ”అని ఎమ్కే గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లీడ్ ఎకనామిస్ట్ పేర్కొన్నారు. గత 11 సంవత్సరాలలో పట్టణ ప్రాంతాలతో పోలిస్తే కుటుంబ ఖర్చులు పెరిగిపోతున్నాయి. దీనికి తగినట్టుగా ఆదాయం మాత్రం పెరగడం లేదు. దీంతో భారత దేశ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో పడే అవకాశం వుందని పలువురు ఆర్ధిక నిపుణులు వ్యాఖ్యానించడం గమనార్హం.అంతేకాక గత దశాబ్ద కాలంగా దేశంలో ప్రజల ఆదాయాలలో పెద్దగా మార్పు రాలేదు. పైగా నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వంటి కారణాలతో అనేక కుటుంబాలు ఆర్థికంగా దుర్భర పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. మూలిగే నక్కపై తాటపండు పడిన చందంగా వినియోగ వస్తువుల ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. వెరసి సగటు మధ్యతరగతి ప్రజానీకం పరిస్థితి అస్తవ్యస్థంగా అయ్యిందని అని వారు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం పంపిణీ చేసిన ఆహార ధాన్యాలు, ప్రభుత్వ పథకాల ద్వారా ఇచ్చిన ఉచిత వస్తువుల ఖర్చును కూడా పరిగణనలోకి తీసుకుంటే గ్రామీణ ప్రాంతాలలో సగటు నెలసరి వినియోగ వ్యయం రూ.3,860, పట్టణ ప్రాంతాలలో రూ.6,521గా నమోదైందని సర్వే నివేదిక తెలిపింది. ఉచిత వస్తువుల విలువను కలపని పక్షంలో వినియోగ వ్యయం గ్రామాలలో రూ.87, పట్టణ ప్రాంతాలలో రూ.62 మాత్రమే పెరిగింది.1999-2000లో గ్రామీణ కుటుంబాల మొత్తం వినియోగ వ్యయంలో ఆహారధాన్యాలపై పెట్టిన ఖర్చు 22 శాతంగా ఉంది. ఇప్పుడది దారుణంగా 4.91శాతానికి పడిపోయింది. పట్టణ ప్రాంతాలలో ఈ ఖర్చు 12 శాతం నుండి 3.64 శాతానికి తగ్గిపోయింది. ఆసక్తికరమైన విషయమేమంటే గత రెండు దశాబ్దాలలో పట్టణ ప్రాంతాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాలలో గుడ్లు, చేపలు, మాంసం, పండ్లు, కూరగాయలపై ఖర్చు పెరుగుతోంది. అయితే ఇక్కడ ఆందోళన కలిగించే విషయం కూడా ఒకటుంది. పట్టణ ప్రాంతాలలోని కుటుంబాలు తమ ఆదాయంలో 2.43 శాతం పాన్‌, పొగాకు, మత్తు పదార్థాలపై ఖర్చు చేస్తు న్నాయి. వినోదంపై 1.58 శాతం దాకా ఖర్చు చేస్తున్నాయి.

సి.హెచ్ . ప్రతాప్

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments