సింహగిరిపై చందనోత్సవానికి విస్తృత ఏర్పాట్లు
జయజయహే : వైశాఖ శుద్ధతదియ పర్వదినాన బుధవారం సింహాద్రి అప్పన్నస్వామి నిజరూప దర్శనం, చందనయాత్ర వైభవంగా నిర్వహించేందుకు సన్నాహాలు జరిగాయి. వేకువజామున 1 గంటకు సుప్రభాత సేవ, విష్వక్సేన ఆరాధన, చందన తొలగింపు, నిజరూప ఆరాధన జరుగుతాయి. 3గంటలకు ఆలయ ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు కుటుంబానికి తొలిదర్శనం, 4గంటల నుంచి సర్వదర్శనం కల్పిస్తారు. రాత్రి 9గంటలకు సహస్ర ఘటాభిషేకం, 11గంటలకు చందన సమర్పణతో చందనోత్సవం సమాప్తమవుతుంది..