జయజయహే : అక్షయతృతీయ వరకు చందనపు పూతలో నరసింహుని అవతారంలో ఉన్న స్వామి వారు చందనపుపూత వొలిచిన వెంటనే భూమిని తన వాడైనా దంతాలమీద పద్మంలా లంకరించుకున్నాడా అన్నట్టుగా ఉన్న స్వామి వరాహస్వామిగా నిజరూపంలో భక్తులకు దర్శనం ఇస్తారు. అక్షయతృతీయ అంటేనే హిందువులలో పణ్డగ వాతావరణం కనబడుతుంది. తృతీయనాడు మహాలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తారు.తమిళనాడులో ఐతే అమ్మణ్ణి అంటే పార్వతి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తారు. మధుర మీనాక్షి. కంచి కామాక్షి అమ్మవార్ల దర్శనంకి తమిళనాడు రాష్ట నలుమూలల నుండి భక్తులు పోటెత్తుతారు.అంతటి విశిష్టత ఉంది అక్షయతృతీయ పండగకు.సంత్సరంలో అక్షయతృతీయ నాడు మాత్రమే సింహాచలకొండా మీద వెలసియున్న నరసింహస్వామి వరాహస్వామిగా నిజరూపము దర్శనం ఇస్తారు అందుకనే వరాహ నృసింహ ద్వియావతార దివ్య క్షేత్రమని సింహాచలానికి పేరు .స్వామి వారి దర్శనానికి భక్తులు ఆంధ్ర,ఒరిస్సా రాష్ట్రాలతో పాటు దేశ నలుమూలల నుండి ఎక్కవగా హాజరవుతారు.
శ్రీవెంకటేశ్వర స్వామి వారిని ఉదయం పూట నిద్ర మేలుకొలుపు సమయంలో సింహాచల స్వామివారు మేలుకొని భక్తులకు దర్శనం ఇస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర మేలుకోవయ్యా అని శ్రీ శ్రీనివాస గద్యం వేదఘోషతో నిద్రనుండి మేలుకోపుతారు. విష్ణుమూర్తికి ఎన్ని అవతారాలున్నాయో అన్ని అవతారాలుకలిగిన ఏకైక దివ్యమంగళరూపం శ్రీ వెంకటేశ్వరస్వామివారు.అంతటి ప్రతిష్ట కలిగిన తిరుమల కొండ కొన్ని నెలలుగా వివాదాలకు, రాజకీయాలకు వేదికగా మారింది.
తిరుమల లడ్డులో జంతు కొవ్వు కలిసిందా?
రాష్ట్రాన్ని ఏలుతున్న ప్రభుత్వ రాజకీయ పెద్దలు వెంకటేశ్వరస్వామివారికి గత ప్రభుత్వం లో ఏర్పడిన పాలకమండలి వారు నైవేద్యం పెట్టే ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిన నెయ్యిని వాడారని నేటి పాలక పెద్దలు బహిరంగ ప్రకటన చేసేసారు.ఆ ప్రకటనతో స్వామివారి భక్తుల మనోభావాలు ఒక్కసారిగా దెబ్బతిన్నాయి. అంతే కాదు అయోధ్యలో బాలరాముని ప్రాణ ప్రతిష్ట మహోత్సవానికి ప్రత్యేకంగా తిరుమల లడ్డులు ప్రసాదంగా పంపిన వాటిలో కూడా జంతువుల కొవ్వు కలిపిన నెయ్యి వాడారని సనాతన ధర్మాన్ని భుజాన్ని వేసుకుని తిరుగుతున్న ఓ ప్రభుత్వ పెద్ద ఉదరగొట్టాడు.వెంటనే ప్రాయచిత్త దీక్ష పూని దుర్గమ్మ మెట్లు కడిగేసాడు.వినకూడని అపశృతి గల వాక్కులు మునుపెన్నడూ వినలేదని గొల్లుమన్నారు.దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.గత పాలకమండలి వారు ప్రజల ముందుకు వచ్చి ఎలాంటి తప్పు జరగలేదని చెప్తూ నిజం తేల్చాలని సర్వోన్నత న్యాయస్థానం మెట్లు ఎక్కారు.న్యాయస్థానం రాజకీయనాయకులకు గట్టిగానే బుద్ది చెప్పి దేవుళ్లను రాజకీయాలకు దూరం పెట్టాలని హెచ్చరిక చేసింది. నైవేద్య,ప్రసాదాలలో జంతుకొవ్వు కలిసిందో లేదో నిజం నిగ్గు తేల్చమని అవినీతి పరులను గడ గడ లాడించే సీబీఐ కి కేసు అప్పగించింది.నేటికి ఆ కేసు ఏమయిందో ఎక్కడవుందో ఎవరికి తెలియడంలేదు.
వైకుంఠ ఏకాదశి రోజున కైలాసంగా మారిన పరిస్థితి
యోగ నిద్ర లో ఉండే విష్ణుమూర్తి మేలుకొని ఉత్తర ద్వారంగుండా భక్తులకు దర్శనం ఇస్తారని భక్తుల ప్రగాఢ విశ్వాసం అటుంటి దర్శనం కోసం ప్రతియేటా కొన్ని లక్షల మంది శ్రీ శ్రీనివాసుని దర్శనం కోసం ఆరాటపడతారు. స్వామి వారిని చూసి ఆనందతన్మయంతో పరవశించిపోతారు.ఆలాంటి రోజున భక్తులు ముందుగానే కొద మీద చేరుకుంటారని దేవస్థానం కార్యాలయ సిబ్బందికి అంచనా ఉంటుంది. కానీ మొన్న అలాజరగలేదేమో ఏకంగా ఎన్నడూలేనివిధంగా తొక్కిసలాట జరిగి మరణాలు చోటుచేసున్నాయి గోవిందా గోవిందా అని మరణ ఘోష స్వామి వారి సన్నిధిలో వినపడింది. ఆ సంఘటన కూడా ప్రపంచంలో శ్రీవారి భక్తులు కన్నీటి పర్యంతమయ్యారు.అయినా అక్కడ ఏమిజరిగిందో కనీసం విచారణ కూడా జరిపించలేదు ప్రభుత్వం.
గోవిందుని గోశాలలో గోవుల మృత్యు ఘోష.
కొద్దీ రోజుల క్రితం స్వామి వారి గోశాలలో ఆకలితో గోవులు,లేగ దూడలు మరణిస్తున్నాయని పాత పాలకమండలి వారు తీవ్ర ఆరోపణలు దేవస్థానం పాలకులపై చేసారు.మావి ఆరోపణలు కాదని జరిగింది నిజమని సాక్ష్యాలు కూడా చూపించారు. మళ్ళీ హిందూ సామాజం మావోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.ముఖ్యమంత్రి అసలు ఒక గోవు కూడా చనిపోలేదు అన్నారు .పాలకమండలి అధ్యక్షుడు గోవులు చనిపోవా మనుషులు చనిపోవడం లేదా అని ప్రశ్నించారు. దేవస్థాన అధికారి 43 గోవులు చనిపోయాయని అవి అనారోగ్యంతో చనిపోయాయయని చెప్పుకొచ్చారు. కాదు చనిపోయినవి రెండువందల ఫై చిలుకు ఆవులతో పాటు లేగ దూడలు కూడా చనిపోయాయి అవి ఆకలి తో చనిపోయాయని మరోసారి సాక్ష్యాలతో బయటపెట్టారు గత పాలకమండలి వారు. గోవులు మరణాలు వాస్తవమని తేలింది.ఎందుకు చనిపోయాయోనని నిజం తెల్పల్సిన భాద్యత ప్రభుత్వం మీద ఉంది కదా. కానీ నేటి వరకు కూడా కేసు రిజిస్టర్ చేయలేదు గోవుల మరణాలపై నిజం తేలలేదు. ప్రపంచంలోనే స్వయంభు శ్రీ కుర్మా అవతార దేవాలయం శ్రీకాకుళంలో ఉంది ఆ దేవాలయపరిధిలో ఏకంగా పదుల సంఖ్యలో శ్రీచక్ర కుర్మాలు మరణిస్తే ఆరుబయటనే కాల్చి వేశారు. ఆ సంఘటన మహాఘోరం అని అందరికి తెలుసు. ఎలా జరిగిందో మాత్రం రహస్యం దాని మీద కనీసం విచారణ చేయలేదు ప్రభుత్వం .
నోరు మెదపని హిందూవాదులు
తిరుమల దేవస్థానం లో జరుగుతున్న పరిణామాలపై పీఠాధిపతులు గాని ,హిందూ సంఘాలు గాని హిందువులకు మేమే బ్రాండ్ అంబాజిడర్లుగా చెప్పుకునే భారతీయ జనతా పార్టీవారు గాని స్వామివారి పేరు చెప్పుకుని ప్రవచనాలు వల్లి వేసే ప్రవచన కర్తలుగాని మరి ముఖ్యంగా బ్రాహ్మణ సంఘాలుగాని తిరుమల దేవస్థానంలో జరిగిన సంఘటనలను ఖంధించలేదు. అంటే వీరు కూడా రాజకీయనాయకుల బాట పట్టారన్న విషయం ఋజువయింది.ప్రస్తుతం నడుస్తున్న ప్రభుత్వాలు జరిగిన సంఘటనలపై నిజాన్ని నిగ్గు తేల్చడంలో విఫలమయ్యాయి అని తెలుస్తుంది. కానీ గాయపడిన భక్తుల మనోభావాలు నిజం తెలియక సతమతవుతున్నాయి.
నిజమేంటో నిగ్గు తేల్చాల్సిన అవసరం ఏర్పడింది స్వామి.
అధికార మదంతో ఉరేగుతూన్న రాజకీయనాయకులు దేవుడునికూడా వదలడం లేదు. కొవ్వు కలిసిందని కొవ్వెక్కి మాతలాడినవారికి..ప్రసాదాలలో నిజముగా కొవ్వు కలిసిన నెయ్యి వాడినట్లయితే కొవ్వెక్కి చేసిన తప్పేకదా అది వాళ్ళకయినా శిక్ష పడాలికదా అదేమీ లేదు. భయం భక్తి లేకుండా అందరు దర్జాగా తిరుగుతున్నారు.ప్రస్తుత పరిస్థితుల్లో నిరూపించుకోవాల్సిన సమయం ఏర్పడింది.నీకు సంబంధంలేని కోర్టు కేసులకు నీ బొక్కసంలో డబ్బు వాడుతున్నారు .కోర్టుల్లో వేసిన కేసులకు వాదించిన న్యాయవాదులకు నీ సొమ్ము ఖర్చుపెట్టాల్సిన అగత్స్యం ఏర్పడింది.నీవు నిజరూపంగా వెలసిన నాడు నిజ నిజాలు తేలాలని భక్తులు ఎదురుచూస్తున్నారు. తప్పు చేసినోడికి కచ్చితంగా శిక్ష పడాలని కోరుకుంటున్నారు.
ధర్మో రక్షిత రక్షితః
మధు భోజంకి.
9493380080