Tuesday, June 17, 2025
HomeEducationటెన్త్ లో ఆల్ సబ్జక్ట్స్ ఫెయిల్

టెన్త్ లో ఆల్ సబ్జక్ట్స్ ఫెయిల్

బెంగుళూరు : జయజయహే : పదవతరగతి లో తమ కుమారుడు అన్ని సబ్జెక్టులు ఫెయిల్  అయినా తల్లితండ్రులు విషయాన్ని చాలా తేలికగా తీసుకున్నారు . పైగా కేక్ కట్ చేయించి వేడుక చేసి మరి తమ కుమారుడికి ధైర్యం చెప్పారు . వివరాల్లోకి వెళ్తే బాగల్కోటె జిల్లా నవనగర్ కు చెందిన అభిషేక్ పదవతరగతిలో అన్ని సబ్జెక్టులు ఫెయిల్  అయ్యాడు . అన్ని సబ్జెక్టులు కలిపి 200 మార్కులు మాత్రమే వచ్చాయి. విషయం తెలిసిన తోటి విద్యార్థులు అభిషేక్ ను హేళన చేసారు. తమ కుమారుని పరిస్థితిని అర్ధం చేసుకొన్న తల్లితండ్రులు మాత్రం ఆలోచించకుండా ఒక కేక్ తెప్పించి కట్ చేయించి వేడుకల చేసారు. ఫెయిల్ అయితే మళ్ళీ పరీక్షలు రాసుకోవచ్చు అని చింతించాల్సిన అవసరం లేదు అని ధైర్యం చెప్పారు. తల్లి తండ్రులతో పాటు తమ్ముడు ,అవ్వ , తదితరులు వేడుకలో పాల్గొన్నారు . అభిషేక్ మీడియా తో మాట్లాడుతూ ఫెయిల్ అయ్యానని నా తోటి విద్యార్థులు కొందరు హేళన చేసారని , చిన్న చూపు చూస్తున్నారని కానీ తమ తల్లి తండ్రులు అండగా నిలిచి ధైర్యం చెప్పారని , నేనురీక్షల్లో ఫెయిల్ అయినా జీవితంలో ఫెయిల్ కానని మరొకసారి ప్రయత్నం చేసి తప్పకుండా పాస్ అవుతా అని తన ఆత్మ విశ్వాసాన్ని వ్యక్తం పరిచాడు .

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments