బెంగుళూరు : జయజయహే : పదవతరగతి లో తమ కుమారుడు అన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయినా ఆ తల్లితండ్రులు ఆ విషయాన్ని చాలా తేలికగా తీసుకున్నారు . పైగా కేక్ కట్ చేయించి వేడుక చేసి మరి తమ కుమారుడికి ధైర్యం చెప్పారు . వివరాల్లోకి వెళ్తే బాగల్కోటె జిల్లా నవనగర్ కు చెందిన అభిషేక్ పదవతరగతిలో అన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయ్యాడు . అన్ని సబ్జెక్టులు కలిపి 200 మార్కులు మాత్రమే వచ్చాయి. ఈ విషయం తెలిసిన తోటి విద్యార్థులు అభిషేక్ ను హేళన చేసారు. తమ కుమారుని పరిస్థితిని అర్ధం చేసుకొన్న తల్లితండ్రులు ఏ మాత్రం ఆలోచించకుండా ఒక కేక్ తెప్పించి కట్ చేయించి వేడుకల చేసారు. ఫెయిల్ అయితే మళ్ళీ పరీక్షలు రాసుకోవచ్చు అని చింతించాల్సిన అవసరం లేదు అని ధైర్యం చెప్పారు. తల్లి తండ్రులతో పాటు తమ్ముడు ,అవ్వ , తదితరులు వేడుకలో పాల్గొన్నారు . అభిషేక్ మీడియా తో మాట్లాడుతూ ఫెయిల్ అయ్యానని నా తోటి విద్యార్థులు కొందరు హేళన చేసారని , చిన్న చూపు చూస్తున్నారని కానీ తమ తల్లి తండ్రులు అండగా నిలిచి ధైర్యం చెప్పారని , నేను పరీక్షల్లో ఫెయిల్ అయినా జీవితంలో ఫెయిల్ కానని మరొకసారి ప్రయత్నం చేసి తప్పకుండా పాస్ అవుతా అని తన ఆత్మ విశ్వాసాన్ని వ్యక్తం పరిచాడు .
టెన్త్ లో ఆల్ సబ్జక్ట్స్ ఫెయిల్
0
15
RELATED ARTICLES
- Advertisment -