ఎల్లవేళలా కార్యకర్తలకు అండగా ఉండే పార్టీ తెలుగుదేశం
కార్యకర్తలే మా శక్తి – వారి కోసం తెలుగుదేశం పార్టీ – లోకేష్ నాయకత్వం యువతకు దిక్సూచి
గాజువాక: జయజయహే : ప్రమాదవశాత్తు మృతి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త బొబ్బడి కనకారావు కుటుంబానికి పార్టీ అండగా నిలిచింది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు స్వహస్తాల ద్వారా, నామినీగా ఉన్న ఆయన భార్య బొబ్బడి లక్ష్మీ కి రూ.5 లక్షల బీమా చెక్కు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబాన్ని పరామర్శిస్తూ మానవీయంగా సానుభూతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ, “కార్యకర్తలే మా బలం. వారి కోసం ఎల్లప్పుడూ తెలుగుదేశం పార్టీ అండగా నిలబడుతుంది” అని స్పష్టం చేశారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువనాయకత్వంలో కోటికి పైగా సభ్యత్వాలు నమోదు చేయడం ఆయన నిర్వహణ సామర్థ్యానికి నిదర్శనం. అయితే ఆ సంఖ్యల కంటే గొప్పది — ప్రతి కార్యకర్త భద్రతపై ఆయన చూపే నిబద్ధత. ఆ దృక్కోణం నుంచే రూపొందినది తెలుగుదేశం కార్యకర్తల సంక్షేమ బీమా పథకం. ఈ బీమా సహాయం ద్వారా పార్టీ తమ కుటుంబ సభ్యుల పట్ల ఉన్న బాధ్యతను కార్యరూపంలో చూపుతోంది. సంఘటనలు జరిగిన వెంటనే స్పందించి, తక్షణమే చర్యలు తీసుకోవడం – తెలుగుదేశం పార్టీ ప్రత్యేకత. మాటలకన్నా ముందే చేతల్లో చూపే పార్టీకే ప్రజల మద్దతు నిలుస్తుందనే విశ్వాసాన్ని ఈ సంఘటన మరొక్కసారి నిదర్శనం చేస్తోంది.