విశాఖపట్నం జయ జయహే: జిల్లా పరిషత్ చైర్ పర్సన్ అధ్యక్షతన 1 నుండి 7 స్థాయీ సంఘ సమావేశాలు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ జల్లిపల్లి సుభద్ర సమావేశాలు ప్రారంభించారు. ప్రజా సమస్యలపై చిత్తశుద్ధితో పనిచేయాలని జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ జె. సుభద్ర ఉమ్మడి విశాఖ జిల్లా అధికారులను ఆదేశించారు. గ్రామీణాభివృద్ధి, ప్రజా సంక్షేమ పనులు, ప్రణాళికలు, ఆర్థిక సాయం, వైద్య ఆరోగ్యం తదితర అంశాలపై చర్చ జరిగింది. సమావేశాల్లో భాగంగా వివిధ శాఖల అధికారులు ఆయా శాఖలకు సంబంధించిన ప్రగతి నివేదికలను ముందుగా చదివి వినిపించారు. వాటిపై సభ్యులు పలు ప్రశ్నలు వేయగా ఆయా శాఖల అధికారులు బదులిచ్చారు. ఇప్పటి వరకు తీసుకున్న చర్యలు, చేపట్టబోయే చర్యల గురించి వివరించారు.ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్ పర్శన్ మాట్లాడుతూ ప్రతి నెలా ఒకటో తేదీన దాదాపు 98%వరకు పింఛన్లు పంపిణీ జరుగుతున్నాయని జెడ్పిటిసి అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. అందుబాటులో లేని వారికి మరుసటి రోజున పింఛన్లు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. అప్పటికి గ్రామాలలో పింఛన్ల విషయంలో ఏమైనా ఇబ్బంది వస్తే స్థానిక ఎంపీడీవోకు తెలియజేయాలని, వెంటనే తగు చర్యలు తీసుకుంటారని ఆమె తెలిపారు. ప్రాజెక్టు డైరెక్టర్, మాట్లాడుతూ స్థలం ఉన్న రైతులు మొక్కల పెంపకం ద్వారా చేపట్టవచ్చని తెలియజేసారు. గ్రామాలలో మురుగు నీటి సమస్యను నివారించడం కొరకు మురుగు కాలువలు చివరి ప్రదేశాలలో ఇంకుడుగోతుల నిర్మాణము చేపట్టుట జరుగుతున్నదని, ప్రతీ గ్రామంలో మూడు వరకు కమ్యూనిటీ ఇంకుగు గోతులు నిర్మాణం నిధుల ద్వారా చేపడతామని తెలియజేసారు. అరుకు జడ్.పి.టి.సి శెట్టి రోషని మాట్లాడుతూ గిరిజన గ్రామాలలో ఫాగింగ్ చేపట్టుట లేదని అందువల్ల మలేరియా, టైఫాయిడ్, డెంగ్యు వంటి వ్యాధులు ప్రభులు తున్నాయని 108 అంబులెన్సులు సకాలంలో స్పందించడంలేదని దీని కారణంగా గిరిజన ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తెలియజేయగా చైర్ పర్సన్ జల్లిపల్లి సుభద్ర మాట్లాడుతూ గిరిజన ప్రాంతమైన పాడేరు మండలంలో 108 సౌకర్యం కల్పించడంలో తీవ్ర జాప్యం జరుగుతున్నదని విషయం నోటీసుకు వచ్చిందని వెంటనే సత్వర చర్యలు తీసుకోవాలని 108 శాఖవారిని ఆదేశించారు. జల్ జీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి కొళాయి కార్యక్రమంపై దృష్టి సారించి త్వరితగతిన ఆ పనులు పూర్తి చేయాలని ఆమె గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులను ఆదేశించారు. అలాగే జల్ జీవన్ మిషన్ ద్వారా పెండింగ్ కనెక్షన్లు, కొన్ని ప్రాంతాల్లోని ఇతర సమస్యలపై మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ లేవనేత్తిన ప్రశ్నకు బదులిస్తూ, వాటిపై తక్షణ చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ సమావేశంలో జడ్పిటీసీ సభ్యులు, పి. నారాయణమూర్తి, ముఖ్య కార్యనిర్వాహణాధికారి జిల్లా ప్రజా పరిషత్, విశాఖపట్నము, ఉప ముఖ్య కార్యనిర్వాహణాధికారి జిల్లా ప్రజా పరిషత్ విశాఖపట్నము కె.రాజ్ కుమార్ మూడు జిల్లాల వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, తదితరులు పాల్గొన్నారు.