జయజయహే : ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్ పూర్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం రాత్రి రాయ్ పూర్-బలోదబజార్ రోడ్డులోని సారగావ్ సమీపంలో ఒక టిప్పర్, డీసీఎం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 13 మంది మరణించగా, చాలా మంది గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్చారు. మృతుల్లో 9 మంది మహిళలు, ఇద్దరు బాలికలు, ఒక టీనేజర్, 6 నెలల శిశువు ఉన్నారు. మృతులందరూ ఛత్తీస్గఢ్లోని చటౌడ్ గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. రాయ్పూర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ లాల్ ఉమ్మద్ సింగ్ మాట్లాడుతూ.. డీసీఎం ఓ వేడుక నుంచి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. గాయపడిన వారిని రాయ్పూర్లోని డాక్టర్ బి.ఆర్. ఆసుపత్రికి తరలించారు. రాయ్పూర్లో జరిగిన ఈ ప్రమాదం రాష్ట్ర రహదారి భద్రతపై ప్రశ్నలను లేవనెత్తుతోంది. 2024లోనే ఛత్తీస్గఢ్లో మొత్తం 14,853 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. వీటిలో 6,752 మంది మరణించారు. 12,573 మంది గాయపడ్డారు.
ఘోర రోడ్డు ప్రమాదం.. 13 మంది మృతి
0
10
Previous article
Next article
RELATED ARTICLES
- Advertisment -