మాడుగుల: జయజయహే : మాడుగులలో వేంచేసి ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా వారి ఆలయ 26వ వార్షికోత్సవ వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. ఉదయం 5 గంటలకు సుప్రభాత సేవ కాగడ హారతి, పంచామృత విశేషాలు అనంతరం సామూహిక సత్యవ్రతలు నిర్వహించారు. మధ్యాహ్నం ఆలయం వద్ద పెద్ద ఎత్తున అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. కొద్దిసేపు వర్షం ఆటంకం కలిగించినప్పటికీ యధా ప్రకారం అన్నదానం కొనసాగింది. అనంతరం ఆలయంలో పారాయణం కార్యక్రమాన్ని నిర్వహించారు. సాయంత్రం గ్రామంలో పల్లకి సేవ అనంతరం స్వామివారి నామ సంకీర్తన కార్యక్రమంతో ఉత్సవాలు ముగించారు. శిరిడి సాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆలయ అధ్యక్షుడు ఎం సతీష్, అధ్యక్షుడు ఎస్ శ్రీనివాసరావు, ఆలయ కమిటీ వ్యవస్థాపక ప్రతినిధులు ఎం నాగ రమేష్, గ్రామ సర్పంచ్ ఎడ్ల కళావతి తదితరులు పాల్గొన్నారు. వందరోజుల నుండి భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
ఘనంగా షిరిడి సాయి ఆలయ వార్షికోత్సవ వేడుకలు
0
20
RELATED ARTICLES
- Advertisment -