జయజయహే : ఓం ప్రకాశ్ను చంపేశాక దుర్మార్గుడిని చంపేశా అంటూ వాట్సాప్ లో పల్లవి పలువురికి మెసేజ్ చేసింది. ఓం ప్రకాశ్ తనను, తన కూతురిని హింసించాడని, తమను ఒక గదిలో బంధించి ఉంచాడని పోలీసుల విచారణలో పల్లవి తెలిపింది . ఓం ప్రకాశ్ తన కొడుకుతో, తన చెల్లితో ఎక్కువగా ఉండేవాడని.. దండేలి వద్ద ఉన్న 17 ఎకరాల భూమిని కూడా కొడుకు, చెల్లికి చేయాలని అనుకున్నాడని భార్య పల్లవి విచారణలో తెలిపింది ..తమను తీవ్రంగా హింసించడం, ఆస్తిలో వాటా ఇవ్వకపోవడంతో మాజీ డీజీపీ ఓం ప్రకాశ్ను భార్య పల్లవి, కూతురు కృతి చంపేశారు .