Tuesday, June 17, 2025
HomeBlogగిరిజనులను మభ్య పెడుతున్న వైసిపి - జి సి సి చైర్మన్ కిడారి శ్రావణ్

గిరిజనులను మభ్య పెడుతున్న వైసిపి – జి సి సి చైర్మన్ కిడారి శ్రావణ్

జయజయహే : జిఓ నెంబర్ 3 విషయంలో వైసీపీ నాయకులు గిరిజనులను మభ్యపెడుతున్నారని మాజీ మంత్రి జి సి సి చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ అన్నారు. శనివారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 2020 లో జగన్ ప్రభుత్వం వైఫల్యం కారణంగా జిఓ నెంబర్ 3 రద్దు అయింది. జిఓ నెంబర్ 3 కోసం మాట్లాడే నైతిక హక్కు వైసీపీ నాయకులకు లేదని పేర్కొన్నారు. గిరిజనులకు లబ్ధి చేకూర్చే జీవో నెంబర్ 3 ని రద్దు చేస్తుంటే వైసీపీ నాయకులు ఎం చేశారు అని ప్రశ్నించారు. జీవో నెంబర్ 275, జీవో నెంబర్ 3 తీసుకువచ్చి గిరిజన ప్రాంతాల అభివృద్ధికి కృషి చేసింది టీడీపీ ప్రభుత్వమేనని అన్నారు. జిఓ నెంబర్ 3 పై వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ కి వెళ్లి ఎందుకు మాట్లాడడం లేదు. ఎమ్మెల్యే లకు చిత్తశుద్ధి ఉంటే పదవులకు రాజీనామా చేసి పోరాటం చేయాలని హితవు పలికారు . గత ఐదు సంవత్సరాలలో స్పెషల్ డి ఎస్ సి నోటిఫికేషన్ ఎందుకు ఇవ్వలేకపోయారు. నాయకులు మంచి కార్యక్రమాలు చేయడానికి ముందుకు రావాలి బురదజల్లే కార్యక్రమాలు కోసం కాదు అని ఎద్దేవా చేశారు. గిరిజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. వైసీపీ నాయకులను నమ్మి గిరిజనులు మోసపోవద్దు అని తెలిపారు .

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments