విశాఖపట్నం జయ జయహే: ఆంధ్రప్రదేశ్ స్టేట్ వైయస్సార్సీపి క్రిస్టియన్ మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ బొల్లవరపు జాన్ వెస్లీ మీడియాతో మాట్లాడుతూ ముందుగా రాష్ట్రంలోని క్రైస్తవులందరకు ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఏపీఎస్సిఎంఎఫ్సి మాజీ చైర్మన్ మద్దిరాల జోసెఫ్ ఇమ్మానుయేల్ వ్యాఖ్యలను ఖండించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత క్రైస్తవులకు చేసింది ఏమీ లేదని తెలియచేస్తూ,పాస్టర్లకు గౌరవ వేతనం 50 కోట్లకు పైగా బకాయిలు కూటమి ప్రభుత్వం చెల్లించవలసి ఉన్నదని ఇలాంటి పరిస్థితుల్లో కేవలం 29 కోట్ల 49 లక్షల 45 వేల రూపాయలు మాత్రమే చెల్లించి క్రైస్తవులకు ఎంతో చేశామని ప్రచారం చేసుకోవడం చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉందని తెలియజేశారు. ఇంకా బకాయి ఉన్న 21 కోట్ల రూపాయలను ఎప్పుడు చెల్లిస్తారని క్రైస్తవ సంఘ కాపరులు ఎదురుచూస్తున్నారని ప్రశ్నించారు?గత 2019- 24 సంవత్సరాల మధ్య కాలంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు క్రైస్తవుల సంక్షేమం కొరకు 1,82,270 మంది లబ్ధిదారులకు 416.56 కోట్ల రూపాయలను వెచ్చించడం జరిగిందని తెలియజేశారు. ఇన్ని కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో క్రైస్తవులకు ఎప్పుడు వెచ్చించలేదని తెలియజేశారు. ఈ ప్రభుత్వo క్రైస్తవుల సమస్యల పట్ల నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తుందని తెలియజేశారు. ఇంత వరకు క్రిస్టియన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ సంస్థకు చైర్మన్ మరియు బోర్డు మెంబర్స్ ను నియమించలేకపోయిందని తెలియజేశారు. గత 2014- 15 సంవత్సరంలో కూడా అప్పటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంనాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల కాలం చైర్మన్ ని నియమించకుండా ఇదే మద్దిరాల జోసెఫ్ ఇమ్మానుయేల్ ని ఎలక్షన్ ముందు మూడు నెలల కాలానికి ముందు బోర్డు మెంబర్స్ ను నియమించకుండా కేవలం చైర్మన్ ను నియమించి,ఒక్క బోర్డు సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయని పరిస్థితులను కల్పించి క్రైస్తవ సమాజాన్ని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కించపరచడం వాస్తవం కాదా అని మద్దిరాలను ప్రశ్నించారు? అంతర్జాతీయ సువార్తికుడు ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతి చెందితే పోస్టుమార్టం నివేదిక మరియు దర్యాప్తు వివరాలను బహిర్గతం చేయడానికి మూడు వారాలు కాలయాపన చేసి క్రైస్తవులలో అభద్రతా భావాన్ని కల్పించి ఇతర కులాల మధ్య చిచ్చుపెట్టే విధంగా ఈ ప్రభుత్వం ప్రవర్తించిందని తెలియజేశారు. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత క్రైస్తవులపై దాడులు పెరిగాయని తెలియజేస్తూ ప్రజాస్వామ్యంలో అన్ని కులాలను మతాలను సమానంగా చూసే బాధ్యత ప్రభుత్వాల మీద ఉందని తెలుసుకోవాలని, ఇప్పటికైనా క్రైస్తవుల సమస్యల పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించాలని కోరారు.