Tuesday, June 17, 2025
HomePOLITICSకుప్పం, గుంటూరు, మాచర్లలో కూటమిదే హవా

కుప్పం, గుంటూరు, మాచర్లలో కూటమిదే హవా

ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంలో ఆ పార్టీ దక్కించుకున్న కుప్పం, గుంటూరు, మాచర్ల మున్సిపల్ పీఠాల్ని ఇప్పుడు కూటమి సర్కార్ కైవసం చేసుకుంది. రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో ఆయా స్ధానాల్లో ఉన్న మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్లు తప్పుకోవడమో, అవిశ్వాసంలో పదవులు కోల్పోవడమూ జరిగింది. దీంతో ఈ సీట్లను ఇవాళ ఎన్నికల ద్వారా కూటమి సర్కార్ తమ ఖాతాలో జమ చేసుకుంది.
ముందుగా సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో ఇవాళ జరిగిన మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికలో పలువురు వైసీపీ సభ్యులు టీడీపీవైపు ఫిరాయించారు. దీంతో ఐదో వార్డ్ కౌన్సిలర్ సెల్వరాజ్ కూటమి తరఫున మున్సిపల్ ఛైర్మన్ గా ఎన్నికయ్యారు. వైసీపీ నుండి నలుగురు కౌన్సిలర్లు టీడీపీ వైపు ఫిరాయించారు. దీంతో 24 మంది సభ్యులలో 14మంది మద్దతుతో పాటు ఎక్స్ ఆఫిషియో మెంబర్ మద్దతు కూడా లభించడంతో టీడీపీ సునాయాసంగా ఛైర్మన్ పీఠం దక్కించుకుంది.
అటు గుంటూరు నగర పాలక సంస్థ మేయర్ పీఠం కూటమి కైవసం అయింది. ఇవాళ జరిగిన మేయర్ ఎన్నికల్లో కూటమికి 34 ఓట్లు, వైసీకి 27 ఓట్లు వచ్చాయి. దీంతో టీడీపీ కౌన్సిలర్ కోవెలమూడి రవీంద్ర మేయర్ గా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారులు ప్రకటించారు. దీంతో టీడీపీ సంబరాల్లో మునిగిపోయింది. గతంలో మేయర్ గా ఉన్న కావటి మనోహర్ నాయుడు రాజీనామా చేయడంతో ఇక్కడ మేయర్ ఎన్నిక జరిగింది.మరోవైపు పల్నాడు జిల్లా మాచర్ల మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికల్లోనూ కూటమి ఘన విజయం సాధించింది. మాచర్ల మున్సిపాలిటీలో 31 వార్డులు ఉండగా.. ఇందులో 21 మంది కౌన్సిలర్ల మద్దతుతో టీడీపీ చైర్మన్ పీఠం దక్కించుకుంది. టిడిపి బలపరిచిన అభ్యర్థి 27 వార్డు కౌన్సిలర్ షేక్ మదార్ సాహెబ్ ఛైర్మన్ పీఠం అధిష్టించబోతున్నారు. గతంలో మాచర్లలో ఏకపక్షంగా ఛైర్మన్ పీఠం దక్కించుకున్న వైసీపీకి ఇది గట్టి ఎదురుదెబ్బగా మారనుంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments