రక్తదానం చేసి స్ఫూర్తినింపిన కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్, డీఆర్వో భవానీ శంకర్
విశాఖపట్టణం: జయజయహే : జిల్లా యంత్రాంగం, ఇండియన్ రెడ్ క్రాస్ సౌసైటీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరానికి దాతల నుంచి విశేష స్పందన లభించింది. జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్, జిల్లా రెవెన్యూ అధికారి బీహెచ్ భవానీ శంకర్, ఇతర అధికారులతో పాటు మొత్తం 149 మంది దాతలు ముందుకొచ్చి స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. గురువారం వరల్డ్ రెడ్ క్రాస్ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా యంత్రాంగం, ఇండియన్ రెడె క్రాస్ సొసైటీలు జిల్లా కలెక్టరేట్ పరిధిలోని ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ భవనంలో, జిల్లా పరిషత్ కూడలిలో ఉన్న ఇండియన్ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకులో వేర్వేరుగా శిబిరాలు ఏర్పాటు చేశాయి. రక్తదాన ఆవశ్యకతను తెలుపుతూ జిల్లా కలెక్టర్ పిలుపు ఇవ్వడంతో జిల్లాలోని వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. కలెక్టరేట్ శిబిరంలో 143 మంది, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకులో ఆరుగురు రక్తదానం చేశారు. ఈ మేరకు రెడ్ క్రాస్ ప్రతినిధులు, ఆదిలీల ఫౌండేషన్, కలెక్టరేట్ అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ క్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి బీహెచ్ భవానీ శంకర్ తో కలిసి రక్తదానం చేసిన జిల్లా కలెక్టర్ అందరిలో స్ఫూర్తినింపారు. కార్యక్రమంలో ఇండియ్ రెడ్ క్రాస్ సొసైటీ సెక్రటరీ రవికుమార్, రావు, ఆదిలీల ఫౌండేషన్ ప్రతినిధి ఆదినారాయణ రాజు, కలెక్టరేట్ ఏవో ఈశ్వరరావు, ఇతర అధికారులు, ఉద్యోగులు, వైద్యాధికారులు, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.