జంగారెడ్డిగూడెం, జయ జయహే: స్థానిక గోకుల తిరుమల పారిజాత గిరి ఏడుకొండలలో ఆరో కొండపై పారిజాత వృక్షాల్లో వేంచేసియున్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలోమంగళవారం ఉదయం స్వామి వారి ఆరాధన తోమాల సేవ బాల భోగ నివేదన తీర్థప్రసాద గోష్టి అనంతరం భక్తులకు దర్శమిచ్చారు. శ్రీ స్వామివారి జన్మనక్షత్రం శ్రవణా నక్షత్రం సందర్భంగా శ్రీ స్వామివారి అమ్మవారి కళ్యాణోత్సవం అత్యంత వైభవం గా జరిగింది. ఈ కళ్యాణోత్సవం పాల్గొన్నభక్తులు జంగారెడ్డిగూడెం వాస్తవ్యులు శ్రీకాళహస్తి నిరంజన్ కుమార్ కుటుంబ సభ్యులు కోయ్యలగూడెం వాస్తవ్యులు శ్రీనివాస్ దుర్గాదేవి కుటుంబ సభ్యులు. పద్మావతి గోదా సమేత శ్రీనివాస కళ్యాణం అత్యంత వైభవంగా ఆలయ అర్చకులు నల్లూరి రవికుమార్ ఆచార్యులు కుమార్ ఆచార్యులు రాఘవాచార్యులు నూతన పట్టు వస్త్రాలు, యజ్ఞోపతం, మాంగల్య ధారణ, ముత్యాల తలంబ్రాలతో ఈ కళ్యాణోత్సవం జరిపించారు. కళ్యాణోత్సవంలో పాల్గొన్న ఉభయ దారులకు శ్రీ స్వామివారి వేద ఆశీస్సులు శ్రీ స్వామివారి సేవాస్త్రాలు శ్రీ స్వామివారి ప్రసాదాలతో సన్మానించారని ఆలయ కార్యనిర్వాహణాధికారి మానికల రాంబాబు తెలియజేశారు.శ్రీ స్వామివారి దర్శనానికి ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు పేరిచెర్ల జగపతి రాజు కుటుంబ సభ్యులు, చింతలపాటి వెంకటరామరాజు కుటుంబ సభ్యులు ఆలయంలో జరిగే ప్రతి మంగళవారం ఉదయం 10 గంటలకు శ్రీ స్వామివారి అష్టదళ పాదపద్మ రాధన అనగా108 స్వర్ణ పుష్పలు అర్చన, బంగారు పుష్పాల పూజ లో పాల్గొన్నా ని తెలియజేసారు.
కన్నుల పండుగగా శ్రీనివాసుని శ్రవణా నక్షత్రం కళ్యాణోత్సవం
0
11
RELATED ARTICLES
- Advertisment -