జయజయహే : మే 16 నుండి జూన్ 2 వరకు రాష్ట్రం లో ఉద్యోగుల బదిలీలకు ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది . ఒకే చోట 5 ఏళ్ళు గడిచిన రాష్ట్ర ఉద్యోగులకు ఖచ్చితంగా బదిలీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది . పదోన్నతి పొంది ఒకే ప్రాంతంలో ఐదేళ్లు పూర్తి చేసిన బదిలీలు తప్పని సరి చేసింది . ఐదేళ్ళు లోపు ఉన్న ఉద్యోగులకు వ్యక్తిగత విన్నపం మేరకు బదిలీలు చేయవచ్చు స్పష్టం చేసింది . వచ్చే ఏడాది మే 31 లోపు రిటైర్మెంట్ ఉండే ఉద్యోగులకు బదిలీ నుండి మినహాయింపు ఇచ్చింది . అంధుల ఉద్యోగులకు బదిలీల్లో ప్రాధాన్యత ఇవ్వనుంది . మానసిక రుగ్మత ఉన్న పిల్లల తల్లిదండ్రుల కు వినతి మేరకు బదిలీల్లో ప్రాధాన్యత ఇవ్వనుంది . ట్రైబల్ ఏరియాలో రెండేళ్ల కంటే ఎక్కువ కాలం పని చేసిన ఉద్యోగులకు బదిలీల్లో ప్రాధాన్యత ఇవ్వనుంది . మెడికల్ గ్రౌండ్ లో బాగంగా బదిలీల్లో వినతి మేరకు బదిలీ జరుగుతుంది . వితంతు ఉద్యోగులకు బదిలీల్లో వారి వినతి మేరకు ప్రాధాన్యత ఇవ్వడం జరగనుంది . స్పౌజ్ ఉద్యోగుల కు బదిలీ లో ఒకే చోట లేదా దగ్గరి ప్రాంతాల్లో బదిలీ చేసేలా ప్రాధాన్యత ఇస్తుంది .
ఏపీలో ఉద్యోగుల బదిలీలు.. మార్గదర్శకాలు జారీ
0
14
Previous article
Next article
RELATED ARTICLES
- Advertisment -