చోడవరం: జయజయహే : చోడవరం ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోగల కే కోటపాడు మండలం ఎల్ కొత్త భూమి శివార్ల లో తనిఖీలలో భాగంగా ఎక్సైజ్ పోలీసులు దాడులు నిర్వహించారు. నాటుసార తయారీకి ఉంచిన 1200 లీటర్ల బెల్లపు పులుపును ధ్వంసం చేసి అక్కడ ఉన్న పది లీటర్ల నాటు సారాను స్వాధీన పరుచుకున్నారు. ఇందుకు సంబంధించి వ్యక్తుల గురించి ఎంక్వయిరీ చేస్తున్నట్టు తెలిపారు. వీఆర్వో సమక్షంలో సారా స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ఎక్సైజ్ సీఐ కె.వి పాపు నాయుడు ఆధ్వర్యంలో ఈ దాడులు నిర్వహించారు.