Tuesday, June 17, 2025
HomeHealthఎన్నాళ్లీ డోలి మోతలు గిరిజన గ్రామాలకు కనీస సౌకర్యాలు కల్పించరా కంప్యూటర్ యోగంలోనూ తప్పని...

ఎన్నాళ్లీ డోలి మోతలు గిరిజన గ్రామాలకు కనీస సౌకర్యాలు కల్పించరా కంప్యూటర్ యోగంలోనూ తప్పని తిప్పలు

మాడుగుల: జయజయహే : తరాలు మారుతున్న వారి తలరాతలు మారడం లేదు ప్రభుత్వాలు మారుతున్న వారి బతుకులలో మార్పులు రాలేదు. ఇంటి వద్ద ఉన్న ఈ రోజుల్లో కనీసం రహదారి సౌకర్యం లేక కిలోమీటర్ల మేర డోలి మోతలు తప్పడం లేదంటూ గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలనాటి మాటలు నీటి మూటలు గాని మిగిలిపోతున్నాయని వారు కన్నీటి పర్యంతమవుతున్నారు. మాడుగుల మండలం ఆవురువాడ పంచాయతీ సామలమ్మ కొండ శిఖర పశువులు బంధ పి బి టి జి కొందు గిరిజన గ్రామం. ఈ గ్రామంలో 7 గిరిజన కుటుంబాలు జీవనం సాగిస్తున్నారు. కనీసం అత్యవసర చికిత్సలకైనా సరే ఒక్క ఆశా కార్యకర్త కూడా ఆ ఊరి వైపు చూడరు. ఈ నేపథ్యంలో అనారోగ్యానికి గురైతే డోలి కట్టి కిలోమీటర్ల మేర నడక సాగించి దగ్గర్లో గల సర్కార్ దవాఖానకు చేరుకోక తప్పడం లేదు. దీనిలో భాగంగానే ఆ గ్రామానికి చెందిన ఏడేళ్ల సేదరి కొండలరావు అనే పిల్లవాడు గత రెండు వారాల నుండి జ్వరంతో బాధపడుతున్నాడు. దగ్గరలో గల కొత్తకోట వచ్చి ప్రైవేటు మందులు తీసుకువెళ్లి వాడిన ఉపయోగం లేకుండా పోయింది. రెండు వారాలైన జ్వరం తగ్గకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల సమయంలో పశువులు బంద గ్రామం నుండి రావికమతం మండలం తాని నిమానుచెట్టు వరకు ఏడు కిలోమీటర్ల మేర డోలిలో తీసుకొని వచ్చి అక్కడినుండి బైక్ మీద కొత్తకోట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి వైద్యం చేయించారు. ఇది మా పరిస్థితి అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే మా గ్రామానికి మంచినీరు సౌకర్యం లేదనీ,గొయ్యి తీసుకుని వాటిలో వచ్చిన చలమ నీరును తాగుతున్నామన్నారు. మా గ్రామానికి గత నెలలో వి. మాడుగుల ఆర్డబ్ల్యూఎస్ అధికారులు , పంచాయతీ కార్యదర్శులు వచ్చి మంచినీరు లేదని గుర్తించి జిల్లా పరిషత్ సీ.ఈ.ఓ కి 15 వ ఆర్థిక సంఘం నిధులు నుండి నాలుగు లక్షల రూపాయలు నిధులు మంజూరు చేయాలని వి మాడుగుల ఎం.పీ.డీ.వో ఎస్టిమేట్ నివేదికని పంపించారన్నారు. నేటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు.మా పి.హెచ్.సి కింతలి వెళ్లాలంటే 10 కిలోమీటర్లు డోలు కట్టుకొని వెళ్లవలసిన పరిస్థితి ఏర్పడిందన్నారు. మాకు అందుబాటు లో ఉన్న కొత్తకోట పిహెచ్సి కీ వెళ్లి వైద్యం అలాగే మా గ్రామానికి కరెంటు సౌకర్యం లేదనీ, రాత్రి వేళలో క్రూర జంతువులు మధ్య జీవనం సాగిస్తూనామని ఆందోళన వ్యక్తం చేశారు. మా గ్రామానికి జన్మన్ పథకంలో భాగంగా విద్యుత్ స్తంభాలు వేసి రెండు నెలలు అవుతుందనీ తదుపరి ఇటువంటి పనులు చేపట్టలేదు అన్నారు.మా గ్రామం అనుకుని జీలుగులోవ అనే గ్రామం ఉంది. ఈ గ్రామంలో కూడా ఇదే పరిస్థితి నెలకొందన్నారు. జనవరి 22వ తేదీన అనకాపల్లి జిల్లా కలెక్టర్ కి రోడ్డు సమస్య పరిష్కారం చేయాలని దరఖాస్తు చేసాము. రోడ్డుకి ఎస్టిమేషన్ వేసి పంపించామని పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్ వారు నివేదికను అందజేశారని తెలిపారు.ఇప్పటికైనా ప్రభుత్వాధికారులు స్పందించి రోడ్డు సమస్య పరిష్కారo చేయాలని క ఆదివాసీ జరిగిన సంఘం 5 వా షెడ్యూల్ సాధన కమిటీ జిల్లా ప్రధాన కార్యదర్శి జిల్లా అధ్యక్షులు ఈ నరసింహమూర్తి, కే గోవిందరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments