Thursday, June 19, 2025
HomeBlogఎంసీహెచ్చార్డీ వైస్‌ చైర్ పర్సన్ గా శాంతికుమారి!

ఎంసీహెచ్చార్డీ వైస్‌ చైర్ పర్సన్ గా శాంతికుమారి!

హైదరాబాద్:జయజయహే : ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి పదవి విరమణ పొందుతున్న శాంతికుమారిని.. హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం ఎంసీహె చ్చార్డీ, వైస్‌ చైర్మన్‌గా ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి ఎం.రఘునందన్‌రావు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎంసీహె చ్చార్డీ వైస్‌ చైర్మన్‌తోపాటు డైరెక్టర్‌ జనరల్‌ (డీజీ)గా అదనపు బాధ్యతలను కూ డా ఆమెకు అప్పగించారు. శాంతికుమారి ఈ నెల 30న పదవీ విరమణ చేశాక ఈ బాధ్యతలను చేపడతారు. ఇప్పటివరకు ఎంసీహెచ్చా ర్డీ,డీజీగా ఉన్న శశాంక్‌ గోయల్‌, సెంటర్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ (సీజీజీ) వైస్‌ చైర్మన్‌గా బదిలీ అయిన నేపథ్యంలో.. ఆ బాధ్యత లను శాంతికుమారికి అప్పగించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments