విశాఖపట్నం : జయజయహే : భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి 14 వ ఆరాధనామహోత్సవాన్ని భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సంస్థలు, విశాఖ జిల్లా యొక్క శ్రీ సత్యసాయి సేవా సమితి-విశాఖపట్నం సిటీ సమితి ఆధ్వర్యం లో ఎమ్.వి.పి. కోలని లోని ప్రేమసదన్ మందిరం లో భక్తి శ్రద్దలతో వందలాది మంది భక్తులు జరుపుకున్నారు. సర్వదేవతాతీత స్వరూపులు భగవాన్ శ్రీశ్రీశ్రీ సత్యసాయిబాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో తేది 24-01-2025 గురువారం నాడు భగవాన్ బాబావారి చతుర్దశ (14వ) ఆరాధనామహోత్సవము ఎమ్.వి.పి. కోలనీ యందు శ్రీ సత్యసాయి ప్రేమసదన్ మందిరంలో ఈ రోజు నిర్వహించబడింది. ఈ కార్యక్రమం లో వందలాది శ్రీ సత్యసాయి భక్తులు, సేవాదళ్ సభ్యులు, శ్రీ సత్య సాయి యువత, బాలవికాస్ విభాగం వారు వివిధ పదాధికారులు మరియు ఆస్తిక మహాశయులు, పురప్రజలు అందరూ పాల్గొని శ్రీ సాయీశ్వరుని యొక్క దివ్య అనుగ్రహ ఆశీస్సులు పొందేరు. కార్యక్రమం ఉదయాన్నే ఓంకారం, సుప్రభాతం, నగర సంకీర్తన తో ప్రారంభమయింది. అనంతరం ప్రేమ సదన్ మందిరం లో రుద్రాభిషేకం, శ్రీ సత్యసాయి సహస్రనామ పుష్పార్చన అనంతరం విశ్వమానవ కళ్యాణం మరియు విశ్వ శాంతి కొరకు శ్రీ సత్యసాయి గాయత్రీ విశ్వశాంతి హోమం జరిగింది. అనంతరం పూర్ణాహుతి జరిపారు.అనంతరం భగవాన్ బాబావారి చతుర్దశ (14వ) ఆరాధనామహోత్సవము సందర్భంగా సేవా కార్యక్రమాలతో పాటు , నారాయణ సేవ( దీనులకు భోజన ప్రసాదం ) అనంతరం భక్తులకు భోజన మహానారాయణ సేవ ప్రసాద వితరణ జరిగింది. సాయంత్రం వేదపఠనం, అష్టోత్తరం అనంతరం సిటీ సమితి గాయనీ గాయకులచే నామ సంకీర్తన అనంతరం శ్రీ సత్యసాయి విద్యా విహార్ మేథమెటిక్స్ డిపార్ట్మెంట్ హెడ్ భగ్గం సురేష్ చే ఆధ్యాత్మిక ఉపన్యాసం అందరినీ భక్తి పారవశ్యం లో ముంచింది. అనంతరం భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారికి మంగళహారతి తో కార్యక్రమం ముగిసింది. ఈ కార్యక్రమం అంతా పి.ఆర్.ఎస్.ఎస్. నాయుడు, జిల్లా అధ్యక్షులు, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు, విశాఖ జిల్లా మరియు శ్రీ డి.వి.వి. సీతారామరాజు, కన్వీనర్, శ్రీ సత్యసాయి సేవా సమితి- విశాఖపట్నం సిటీ స్వయంగా సమన్వయపరిచారు.
భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి 14 వ ఆరాధనామహోత్సవం సందర్భంగా శ్రీ సత్య సాయి విద్యా విహార్ పదవ తరగతి విద్యార్థులు (బాలురు & బాలికలు) చే సేవా కార్యకలాపాలు నిర్వహించబడ్డాయి. ముందుగా వీధి సేవ అంటే దేవాలయాల దగ్గర ఉన్న దీనులకు, నిరాశ్రయులకు మజ్జిగ, అరటిపండ్లు, బిస్కట్ పాకెట్స్ నిరాశ్రయులకు ప్రేమతో అందచేశారు. అనంతరం (టి ఎస్ ఆర్ కాంప్లెక్స్) వద్ద ఉన్న ఆశ్రయ అనాథాశ్రమం లోని వారికి బియ్యం, కూరగాయలు,సన్ఫ్లవర్ ఆయిల్,బంగాళాదుంపలు,ఫినైల్, మినపప్పు, కందిపప్పు, ఉల్లిపాయలు,ఇడ్లీ రవ్వ, గుమ్మడికాయలు,టమోటాలు,టీ పొడి, పచ్చిమిర్చి, చక్కెర, అల్లం, బట్టలు ఉతుక్కునేందుకు పౌడర్, సబ్బు, వంకాయ, క్యాబేజీ,కాబులి శనగలు, ప్రేమతో అందచేశారు. శ్రీ సత్య సాయి విద్యా విహార్ స్కూలు ప్రిన్సిపాల్ నేతృత్వం లో స్కూలు టీచర్స్, సిబ్బంది తో కలిసి 20 మంది పదవ తరగతి విద్యార్థినీ విద్యార్థులు ఈ సేవా కార్యక్రమం లో పాల్గొన్నారు.