ఆపరేషన్ సిందూర్’ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా మారుమోగిపోతుంది. ఈ పేరు పాకిస్థాన్ గుండెల్లో అలజడి రేపుతోంది. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఎక్కుపెట్టిన అస్త్రమే ఆపరేషన్ సింధూర్. ఈ మిషన్ లో భాగంగా మంగళవారం అర్ధరాత్రి 1 గంట 44 నిమిషాలకు దాడులు చేపట్టింది. కేవలం 25 నిమిషాల్లోనే పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని 9 కీలక ప్రాంతాల్లో దాడులు చేసింది. భారత్ నిర్వహించిన ఈ దాడుల్లో దాదాపు 100 మంది వరకు ఉగ్రవాదులు మృతి చెందినట్లు కేంద్ర రక్షణశాఖ పేర్కొంది. ‘ఆపరేషన్ సిందూర్’పై దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుతున్నాయి. అటు పహల్గాం బాధితులతో పాటు యావత్ భారతావని ఈ నిర్ణయాన్ని హర్షిస్తోంది. అయితే మరికొందరు తమకున్న దేశ భక్తిని వినూత్నంగా చాటారు. ఈ క్రమంలో బిహార్ లోని ఓ ఆస్పత్రిలో 12 మందికి ‘సిందూర్’, ‘సిందూరి’ అనే పేర్లు పెట్టారు ఆ పిల్లల తల్లిదండ్రులు. ఈ మేరకు వినూత్నంగా తమ దేశభక్తిని చాటారు. ‘ఆపరేషన్ సిందూర్’ను ఎప్పటికీ తమ మదిలోనే భద్రపరుచుకుంటామని ఈ మేరకు చెబుతున్నారు.అలాగే ముజఫర్పూర్ లోని కేజ్రీవాల్ చిల్డ్రన్ ఆస్పత్రిలో కూడా అక్కడి తల్లులు దేశ భక్తిని చాటారు. ‘ఆపరేషన్ సిందూర్’ రోజున పుట్టిన 12 మంది పిల్లలకు పేర్లు పెట్టారు. మగపిల్లలకు ‘సిందూర్’, ఆడపిల్లకు ‘సిందూరి’ అని నామకరణం చేశారు. దీంతో ఈ కథనం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. భారత్ వ్యాప్తంగా నెటిజన్లు ఆ తల్లులను ప్రశంసిస్తున్నారు.
ఆడపిల్లలకు ‘సిందూరి’.. మగపిల్లలకు ‘సిందూర్’.. దేశభక్తిని చాటుతున్న తల్లులు .
0
9
Previous article
RELATED ARTICLES
- Advertisment -