జయజయహే: భారత్- పాకిస్తాన్ మధ్య కొనసాగిన యుద్ధం, శతృదేశ సైనికుల నుంచి ఎదుర్కొన్న ప్రతిదాడులు, మోర్టార్ షెల్స్ కాల్పుల మధ్య ఆందోళనకర వాతావరణం నెలకొన్న జమ్మూ కాశ్మీర్లో ఇప్పుడిప్పుడే పరిస్థితులు సర్దుకుంటోన్నాయి. సాధారణ జనజీవనం ఏర్పడుతోంది. ప్రజలు తమ రోజువారీ పనుల్లో నిమగ్నమౌతోన్నారు. ఈ పరిస్థితుల మధ్య ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హఠాత్తుగా పంజాబ్లో పర్యటిస్తోన్నారు. అక్కడి ఆదమ్పూర్ ఎయిర్ బేస్ను సందర్శించారు. ఎయిర్ వారియర్లతో భేటీ అయ్యారు. పాకిస్తాన్తో యుద్ధ వాతావరణం, సీజ్ ఫైర్ తరువాత నెలకొన్న పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. వారి ధైర్య సాహసాలను ప్రశంసించారు. వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపారు.
అన్ ప్లాన్డ్.. అన్ షెడ్యూల్డ్: హఠాత్తుగా పంజాబ్ వెళ్లిన ప్రధాని మోదీ
0
5
RELATED ARTICLES
- Advertisment -