జయజయహే : ఎమ్మెల్యే వంశీ కృష్ణ శ్రీనివాస్ అనారోగ్యంతో ఇంటివద్ద చికిత్స పొందుతున్న 29వ వార్డు తెలుగుదేశం బూత్ అధ్యక్షులైన పల్లా మధు ,అక్కరమాని సూరిబాబుని వారి ఇంటికి వెళ్లి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని తనవంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు.మెరుగైన వైద్యం అందేలా సహాయ సహకారాలు చేస్తానని , ముఖ్య మంత్రి సహాయ నిధి వచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 29వ వార్డు ఇంచార్జి దువ్వి గోవిందరావు,29వ వార్డు కార్పొరేటర్ ఉరికిటి నారాయణ రావు,29వ వార్డు మాజీ కార్పొరేటర్ బుద్ధల అనురాధ ,జనసేన పార్టీ నేతలు మన్యాల శ్రీనివాస్ రావు, 29 జనసేన అధ్యక్షులు అంగటి శ్రావణ్ కుమార్ , భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు దేవాడ శేఖర్, తెలుగుదేశం నాయకురాలు నర్సయమ్మ,కూటమి శ్రేణులు పాల్గొన్నారు.