జయజయహే : పహల్గాం ఉగ్రదాడికి కౌంటర్ గా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా కొనసాగుతోంది. భారత్ లో చిచ్చు రేపాలని చూసిన ఉగ్రవాదులకు గుణపాఠం చెప్పేలా భారత సైన్యం ఈ ఆపరేషన్ ను కొనసాగిస్తోంది. ఇప్పటికే పాకిస్తాన్ తో పాటు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్రశిబిరాలను నేలకూల్చడంతో పాటు తాజాగా లాహార్ లోని ఆయుధ రక్షణ వ్యవస్థలను కూడా కుప్పకూల్చింది. ఈ క్రమంలో పాకిస్తాన్ భారత సరిహద్దుల్లోని రాష్ట్రాలపై డ్రోన్లు, మోర్టార్లతో కవ్వింపు చర్యలకు దిగుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం కీలక ఆదేశాలు ఇచ్చింది. యుద్ధ పరిస్ధితుల్లో వాడే అత్యవసర అధికారాలను వాడాలని రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం కోరింది. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు హోంశాఖ ఈ మేరకు అత్యవసర ఆదేశాలు జారీ చేసింది. 1968 నాటి పౌర రక్షణ నిబంధనల ప్రకారం అత్యవసర అధికారాలను ఉపయోగించాలని కేంద్రం రాష్ట్రాలను కోరింది. ముఖ్యంగా దాడులు లేదా అంతరాయాల ముప్పు ఉన్న సందర్భాలలో ఈ ఆదేశంతో అధికారులు వేగంగా నిర్ణయాలు తీసుకోవడానికి, అత్యవసర కొనుగోళ్లు చేయడానికి వీలవుతుంది.
అత్యవసర అధికారాలను వాడేయండి..రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం…
0
15
RELATED ARTICLES
- Advertisment -